హైదరాబాద్, నవంబర్ 30:
ఢిల్లీ మద్యం స్కామ్ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు ను ఈడీ అధికారులు చేర్చారు. అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ పేర్కొంది. మంగళవారం రాత్రి అమిత్ ఆరోరాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అలాగే సౌత్ గ్రూప్ సంస్థ వంద కోట్ల రూపాయల ముడుపులను చెల్లించినట్లు తేల్చారు. సౌత్గ్రూప్ను శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగంట నియంత్రించేవారని ఈడీ వెల్లడించింది. ఈ గ్రూపు ద్వారా రూ. వంద కోట్లను విజయ్నాయర్కు చేర్చినట్లు తెలిపారు.ఈడీ చేసిన దర్యాప్తులో అమిత్ ఆరోరా వాగ్మూలంలో ఈ విషయాన్ని స్పష్టంగా ధృవీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. 36 మంది రూ. 1.38 కోట్లు విలువ చేసే 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ ధ్వంసం చేసిన ఫోన్లలో 10 కవిత ఫోన్లు, రెండు నంబర్లు వాడినట్లు ప్రకటించారు. ఆమె వాడిన ఫోన్లు కనిపించకుండా పూర్తిగా ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.