Sunday, November 6, 2022

జింబాబ్వేపై భారత్ గెలుపు: ఈ నెల 10న ఇంగ్లాండ్‌తో సెమీస్

మెల్బోర్న్ ,నవంబర్ 5:టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై టీమ్‌ఇండియా 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టీమ్‌ఇండియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 17.2 ఓవర్లకు 115 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో సికందర్‌ రజా (34*), బర్ల్‌(35) తప్ప పెద్దగా ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 3, షమీ, హార్దిక్‌ 2 వికెట్ల చొప్పున తీయగా.. భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌, అక్షర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ నెల 10న సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా తలపడనుంది.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...