Friday, November 25, 2022

శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్‌ కు కొత్త టెర్మినల్

హైదరాబాద్, నవంబర్ 26: శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్‌ కోసం 2018లో హజ్‌ టెర్మినల్‌ సమీపంలో నిర్మించిన టెర్మినల్‌ను ఈ నెల 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేస్తున్నారు. విమానాశ్రయ విస్తరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ అధికారులు తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రధాన టెర్మినల్‌ను సిద్ధం చేశామని, సౌదీ ఎయిర్‌లైన్స్‌ ఎస్‌వీ-753 తొలి అంతర్జాతీయ విమాన సర్వీస్‌ సౌదీ అరేబియాకు ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు ప్రధాన టెర్మినల్‌ నుంచి బయలుదేరుతుందని పేర్కొన్నారు. అదనపు వివరాలకు 040-66546370 నంబరు ను సంప్రదించాలని సూచించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...