Monday, February 21, 2011

ప్రముఖ నటుడు మిక్కిలినేని కన్నుమూత

విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘దీక్ష’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఆయన అయిదుసార్లు జైలుకు కూడా వెళ్లారు.  మిక్కిలినేని గా ప్రసిద్ధులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి  పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు. ఆంధ్ర నాటకరంగ చరిత్ర, తెలుగువారి జానపద కళారూపాలు, ప్రజా పోరాటాల రంగస్థలం,ఆంధ్రుల నృత్య కళావికాసం,తెలుగువారి చలన చిత్ర కళ మొదలైన రచనలు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా 1982లో గౌరవ డాక్టరేట్ 'కళాప్రపూర్ణ' అందుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...