న్యూఢిల్లీ, మార్చి 30 : భారతీయ జనతా పార్టీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. సభ్యత్వాల విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీని తాము అధిగమించామని కమలం పార్టీ నేతలు అన్నారు. బీజేపీ కీర్తి కిరీటంలో మరో కలుకితరాయి వచ్చి చేరింది. ప్రపంచంలోని పార్టీలు అన్నింటిని ఆధిగమించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆదివారం నాటికి ఆ పార్టీ సభ్యత్వాలు 8 కోట్ల 80 లక్షలకు చేరాయి. ఇది చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాలకంటే ఎక్కువ కావడం విశేషం. సీపీసీలో 8 కోట్ల 60 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకు అదే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పార్టీగా ఉంది. అయితే సభ్యత్వాల విషయంలో ఇప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీలు కూడా తాము అధిగమించామని బీజేపీ ప్రకటించుకుంది.
మార్చి 31 నాటికి 10 కోట్ల మంది సభ్యులను చేర్చుకోవడమే లక్ష్యంగా బీజేపీలో సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని 2014 నవంబర్ ఒకటిన ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒక్క ఫోన్ కాల్తో సభ్యులుగా చేరే హైటెక్ విధానాన్ని బీజేపీ ప్రవేశపెట్టింది. తొలి సభ్యులుగా మోదీ చేరారు. అయితే పార్టీ సభ్యత్వాలు 10 కోట్లకు చేరకపోయినా 8 కోట్ల 80 లక్షలతో అతి పెద్ద పార్టీగా నిలిచింది
మార్చి 31 నాటికి 10 కోట్ల మంది సభ్యులను చేర్చుకోవడమే లక్ష్యంగా బీజేపీలో సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని 2014 నవంబర్ ఒకటిన ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒక్క ఫోన్ కాల్తో సభ్యులుగా చేరే హైటెక్ విధానాన్ని బీజేపీ ప్రవేశపెట్టింది. తొలి సభ్యులుగా మోదీ చేరారు. అయితే పార్టీ సభ్యత్వాలు 10 కోట్లకు చేరకపోయినా 8 కోట్ల 80 లక్షలతో అతి పెద్ద పార్టీగా నిలిచింది