న్యూఢిల్లీ,అక్టోబర్ 31: కాంగ్రెస్, బీజేపీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అధినేత ముకేష్ అంబానీ జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయని ఇండియా అగెనైస్ట్ కరప్షన్ సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. కృష్ణా-గోదావరి బేసిన్ గ్యాస్ నిక్షేపాల విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాగిరి చేస్తోందని.. గ్యాస్ ధర పెంపు కోరుతూ ఉత్పత్తిని, సరఫరాను తగ్గించి వేస్తూ బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. రిలయన్స్ కేజీ బేసిన్ గ్యాస్ కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేజీ బేసిన్ ను ఓఎన్జీసీ కానీ, గ్యాస్ను తక్కువ వ్యవధిలో చౌకగా సరఫరా చేసే సంస్థలకు కానీ కేటాయించాలన్నారు. కేజీ బేసిన్ కాంట్రాక్టు వ్యవహారం పైన, గ్యాస్ ధరను పెంచడానికి రిలయన్స్ అధినేత అంబానీ తెస్తున్న ఒత్తిళ్లపై కాగ్ ద్వారా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. టెలికం మంత్రిని టాటా, పెట్రోలియం మంత్రిని ముకేష్ అంబానీలు నియమిస్తున్నారని ఎద్దేవా చేశారు.కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ప్రణబ్ ముఖర్జీ రిలయన్స్కు రూ. 10 వేల కోట్లు లాభం చేకూర్చారని ఆయన ఆరోపించారు. ‘‘యూనిట్ గ్యాస్ను 4.25 డాలర్ల ధరకు సరఫరా చేస్తామన్న రిలయన్స్ డిమాండ్కు ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల సాధికార బృందం అనుమతి ఇచ్చింది’’ అని ఆరోపించారు.
Wednesday, October 31, 2012
50 దాటిన శాండీ మృతులు...
న్యూయార్క్ , అక్టోబర్ 31: అట్లాంటిక్ మహా సముద్రంలో పుట్టిన అతిపెద్ద హరికేన్ శాండీ వల్ల అమెరికాలో మృతుల సంఖ్య 50 దాటింది. ఒక్క న్యూయార్క్ లోనే 18 మంది మృతి చెందారు. 80 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్ లోని చాలా ఇళ్లలోకి వరదనీరు చొచ్చుకొని వచ్చింది. 18 వేల విమానాలను రద్దు చేశారు. శాండీ తుపాను కారణంగా వర్జీనియా లో పలుచోట్ల భారీగా మంచు కురిసింది. సబ్ వేలు తెరవాలంటే ఎన్నిరోజులు పడుతుందో చెప్పలేమని అధికారులు అంటున్నారు. అలాగే మొత్తం కరెంట్ సరఫరా పునరుద్ధరణకు మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. కాగా, వాల్ స్ట్రీట్ లో ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైంది.
రాష్టానికి తప్పిన తుఫాను గండం
హైదరాబాద్, అక్టోబర్ 31: రాష్టానికి నీలం తుఫాను గండం తప్పింది. మహాబలిపురం వద్ద తుఫాను తీరాన్ని దాటింది. తుఫాను తీరాన్ని దాటిన సమయంలో మహాబలిపురం వద్ద గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. మహాబలిపురం వద్ద దాదాపు 4వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను వల్ల రాష్ట్రానికి ఏ విధమైన నష్టం వాటిల్లలేదని, రెవెన్యూ మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. ఈ తుఫాను వల్ల 61 మండలాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. తుఫాను సహాయక చర్యల్లో భాగంగా 47 మంది జాతీయ విపత్తు స్పందన బృంద సభ్యులను నెల్లూరుకు పంపినట్లు తెలిపారు. చిత్తూరు, నెల్లుూరు జిల్లాల్లో గతంలో పనిచేసిన సీనియర్ ఐఎఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా పంపించినట్లు ఆయన తెలిపారు.
Tuesday, October 30, 2012
డిసెంబర్లో భారత్-పాక్ సీరీస్
న్యూఢిల్లీ,అక్టోబర్ 30: భారత్-పాక్ జట్ల మధ్య భారత్ వేదికగా సిరీస్ నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు కు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 22 న పాకిస్తాన్ జట్టు భారత్ రానుంది. ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, అహ్మదాబాద్, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో ఇరుజట్లు 3 వన్డేలు, 2 టీ 20 మ్యాచ్ ల్లో తలపడనున్నాయి.
Monday, October 29, 2012
ఫైనల్లో ఓడిన సైనా..
పారిస్ , అక్టోబర్ 29 : ప్రపంచ మూడో ర్యాంక్ క్రీడాకారిణి, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఓటమి పాలైంది.
26వ ర్యాంక్ జపాన్ క్రీడాకారిణి మితానీ మినాత్సును ఢీకొన్న ఆమె తొలి సెట్లో కొంత వరకూ పోరాడినా, ఆ తర్వాత తడబడింది. ఫలితంగా మ్యాచ్ని 19-21, 11-21 తేడాతో చేజార్చుకుంది.
అద్భుత విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చిన సైనాకు టైటిల్ దక్కుతుందని అభిమానులు ఆశించారు. కానీ, 22 ఏళ్ల ఈ హైదరాబాదీ పై మినాత్సు అనూహ్యంగా చెలరేగింది. అద్భుతమైన స్మాష్లతో విరుచుకుపడింది.
26వ ర్యాంక్ జపాన్ క్రీడాకారిణి మితానీ మినాత్సును ఢీకొన్న ఆమె తొలి సెట్లో కొంత వరకూ పోరాడినా, ఆ తర్వాత తడబడింది. ఫలితంగా మ్యాచ్ని 19-21, 11-21 తేడాతో చేజార్చుకుంది.
అద్భుత విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చిన సైనాకు టైటిల్ దక్కుతుందని అభిమానులు ఆశించారు. కానీ, 22 ఏళ్ల ఈ హైదరాబాదీ పై మినాత్సు అనూహ్యంగా చెలరేగింది. అద్భుతమైన స్మాష్లతో విరుచుకుపడింది.
శాండీ గుప్పెట్లోఅమెరికా తూర్పు తీరం
వాషింగ్టన్, అక్టోబర్ 29 : కరేబియన్ దీవుల్లో పెను విధ్వంసం సృష్టించి 60 మందిని బలితీసుకున్న శాండీ హరికేన్ ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. భీకర ఉప్పెనగా దేశ తూర్పు తీరంపై విరుచుకుపడబోతోంది. శాండీ ప్రళయాన్ని తట్టుకునేందుకు ఒబామా ప్రభుత్వం న్యూయార్క్తో పాటు డెలవేర్, న్యూజెర్సీ, కనెక్టికట్ వంటి ఇతర ప్రాంతాలు, నగరాల్లో ఎమర్జెన్సీ విధించింది. 30 సెంటీమీటర్ల మేర కుంభవృష్టి కురుస్తుందని గంటకు 135 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హరికేన్ సెంటర్ హెచ్చరించింది.శాండీ తీరాన్ని సమీపించే సమయంలో అట్లాంటిక్ మహాసముద్ర అలలు సాధారణ స్థితి కంటే 4 నుంచి 8 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల నుంచి 3.75 లక్షల మందిని ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్త చర్యగా న్యూయార్క్లోని సబ్వేలను మూసివేశారు. బస్సులు, ట్రామ్స్ వంటి ప్రజారవాణా సేవలను నిలిపివేశారు. న్యూయార్క్ నుంచి పలు విమానాలు కూడా రద్దయ్యాయి. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో . ఫిజికల్ ట్రేడింగ్ను నిలిపేశారు. 1985 తర్వాత స్టాక్ మార్కెట్లు మళ్లీ వాతావరణం వల్ల మూత పడడం ఇదే ప్రధమం.
Sunday, October 28, 2012
లేటయినా లేటెస్టు గా పని చేస్తా...చిరు
న్యూఢిల్లీ,అక్టోబర్ 28: మంత్రి పదవి లేటుగా వచ్చినా లేటెస్టుగా బాధ్యతలు నిర్వహిస్తానని స్వతంత్ర హోదాతో పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన చిరంజీవి అన్నారు. మంత్రివర్గంలో అనుభవం ఉన్న వాళ్లకి, యువతకి పెద్ద పీట వేశారన్నారు.014లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకుకృషి చేస్తామని, సర్వే సత్యనారాయణ, కిల్లి కృపారాణి, బలరాం నాయక్లను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కాంగ్రెసు పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందనేది అర్థమవుతోందన్నారు. మంత్రి పదవిని హోదాగా భావించడం లేదని, బాధ్యతగా గుర్తిస్తున్నట్లు చెప్పారు. దేశంలో పర్యాటకరంగానికి అన్ని హంగులు ఉన్నాయని, దేశంలో సుదీర్ఘ తీర ప్రాంతముందని, పీరియడ్ తక్కువ ఉన్నా తన పని తీరు చూపిస్తానన్నారు. తనపై విశ్వాసం ఉంచి పదవి ఇచ్చారని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలిగిందన్నారు.
అవినీతి ఆరోపణల మంత్రికి అందలం....ఖుర్సీద్ కు ఏకంగా విదేశాంగ శాఖ కేటాయింపు... పురంధేశ్వరికి ఆశాభంగం-ప్రమోషన్ లేకుండా శాఖ మార్పుతో సరి
న్యూఢిల్లీ,అక్టోబర్ 28: ప్రధాని మన్మోహన్సింగ్ ఆదివారం నాడు తన కేబినెట్లో భారీగా మార్పులు చేర్పులూ చేశారు. 22 మందిని కేబినెట్లోకి తీసుకున్న మన్మోహన్, మరో 22 మంది శాఖలను(మొత్తంగా 44 మా ర్పులు, చేర్పులు) మార్చారు. దీంతో మొత్తం కేబినెట్ సభ్యుల సంఖ్య 78కి (రాజ్యాంగం అనుమతించే సంఖ్య 81కి కేవలం మూడు తక్కువ)చేరింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖుర్షీద్ను..విదేశాంగ మంత్రిగా అందలం ఎక్కించడం ఈ పునర్వ్యవస్థీకరణలో గమనార్హం. కాగా, రాష్ట్రానికి చెందిన ఎం.ఎం.పళ్లంరాజు, కె.చిరంజీవి, కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి, సర్వే సత్యనారాయణ, పోరిక బలరాం నాయక్, కిల్లి కృపారాణితో సహా మొత్తం 22 మంది కొత్త మంత్రులతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో కె.రెహ్మాన్ఖాన్, దిన్షా జె.పటేల్, అజయ్ మాకెన్, ఎం.ఎం.పళ్లంరాజు, అశ్వనీకుమార్, హరీష్ రావత్, చంద్రేష్ కుమారి కటోచ్లు(మొత్తం ఏడుగురు) కేబినెట్ హోదా మంత్రులుగా.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ, రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు కె.చిరంజీవి స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా.. శశి థరూర్, కోడైకున్నిల్ సురేష్, తారిక్ అన్వర్, కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి, రాణీ నారహ్, అధీర్రంజన్ చౌధురి, ఎ.హెచ్.ఖాన్ చౌధురి, సర్వే సత్యనారాయణ, నినాంగ్ ఇరింగ్, దీపా దాస్ మున్షీ, పోరిక బలరాం నాయక్, కిల్లి కృపారాణి, లాల్చంద్ కటారియాలు(మొత్తం 13 మంది) సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. పళ్లంరాజుకు పదోన్నతి లభించింది. అయితే, కేబినెట్ హోదా దక్కుతుందని ముందు నుంచి ప్రచారం జరిగిన పురందేశ్వరి అవకాశాలకు కావూరి రాజీనామా లేఖాస్త్రం గండి కొట్టినట్టు సుస్పష్టమైంది.ఆమెను మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి వాణిజ్యం, పరిశ్రమల శాఖకు మార్చారు.ఇప్పటివరకూ రక్షణ శాఖ సహాయమంత్రిగా ఉన్న పళ్లంరాజుకు కేబినెట్ హోదా ప్రమోషన్ ఇచ్చి, కీలకమైన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖను అప్పగించారు. ప్రజారాజ్యం పార్టీని బేషరతుగా విలీనం చేసిన సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తూ చిరంజీవికి స్వతంత్ర ప్రతిపత్తితో పర్యాటక శాఖను కేటాయించారు. సహాయ మంత్రులుగా కేబినెట్లో చేరిన కోట్లకు రైల్వేశాఖ, సర్వేకు రహదారులు, రోడ్డు రవాణా శాఖ, బలరాం నాయక్కు సామాజిక న్యాయం, సాధికారత శాఖ, కృపారాణికి కమ్యూనికేషన్లు, ఐటీ శాఖను ఇచ్చారు. కొత్త మంత్రుల చేరికతో కేబినెట్లో రాష్ట్ర ప్రాతినిధ్యం 11(రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న జైరాం రమేశ్కు కలుపుకుని)కి పెరిగింది. భార్య ఎన్జీవో అక్రమాల వివాదంలో నోరుజారి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ను తొలగిస్తారని అందరూ భావించగా.. అందుకు పూర్తి భిన్నంగా ఆయనకు కేబినెట్లోని ‘టాప్ 4’లో స్థానం కల్పించడం విశేషం.
Saturday, October 27, 2012
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సైనా
పారిస్,అక్టోబర్ 27: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో నాలుగో సీడ్ జూలియన్ షెంక్ (జర్మనీ)పై 21-19, 21-8తో విజయం సాధించింది. ఈ టోర్నీలో 2009లో క్వార్టర్ ఫైనల్ చేరిన సైనా 2011 లో మాత్రం రెండో రౌండ్లోనే ఓడిపోయింది. 2007, 2008, 2010లలో ఆమె ఈ టోర్నీలో పాల్గొనలేదు.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో నాలుగో సీడ్ జూలియన్ షెంక్ (జర్మనీ)పై 21-19, 21-8తో విజయం సాధించింది. ఈ టోర్నీలో 2009లో క్వార్టర్ ఫైనల్ చేరిన సైనా 2011 లో మాత్రం రెండో రౌండ్లోనే ఓడిపోయింది. 2007, 2008, 2010లలో ఆమె ఈ టోర్నీలో పాల్గొనలేదు.
ఏడుగురికి ఉద్వాసన...రాష్ట్రం నుంచి ఐదుగురు...?
న్యూఢిల్లీ,అక్టోబర్ 27:కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో రాష్ట్రం నుంచి ఐదుగురిని తీసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ, ఉత్తర కోస్తా నుంచి కిల్లి కృపారాణి లకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. కాగా, చిరు, కోట్ల సూర్య ప్రకాశ రెడ్డి, బలరాం నాయక్ ల పేర్లు ఇంతకె మందే ఖారయ్యాయి. సర్వే సత్యనారాయణకు సహాయ మంత్రి హోదా ఇచ్చి సామాజిక న్యాయశాఖను కేటాయించే అవకాశం ఉంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి రైల్వే శాఖ సహాయ మంత్రి పదవి దక్కనుంది.కిల్లి కృపారాణికి ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పదవి దక్కనుంది. చిరంజీవికి పర్యాటక శాఖను అప్పగించి స్వతంత్ర హోదా ఇస్తారని సమాచారం. బలరాం నాయక్కు గిరిజన శాఖ సహాయ మంత్రిపదవి ఇవ్వచ్చు.
ఏడుగురి రాజీనామా
కేంద్రం మంత్రి వర్గం నుంచి ఏడుగురుమంత్రులు రాజీనామా చేశారు. ఎస్.ఎం.కృష్ణ, అంబికాసోనీ, సుభోద్ కాంత్ సహాయ్, ముకుల్ వాస్నిక్, మహదేవ్ సింగ్ ఖండేలా,అగథా సంగ్మా ,విన్సెంట్ పాల రాజినామాలను ప్రధాని అమోదించారు. ఎస్.ఎం.కృష్ణ, ముకుల్ వాస్నిక్ లకు పార్టీ పదవులు అప్పగించే అవకాశం ఉంది. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంతరంగిక బృందంలోకి అంబికాసోనీని తీసుకుంటారని తెలుస్తోంది.సుభోద్ కాంత్ సహాయ్ బొగ్గు స్కాంతో పదవిని కోల్పోయారు. ఆరుగురు సీనియర్ మంత్రుల శాఖలలో కోత విధిస్తారు. రెండేసి శాఖలు ఉన్నవారి వద్ద నుంచి ఒక శాఖని తొలగిస్తారు. సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య, మిలింద్ దేవరాలకు ప్రమోషన్ ఇస్తారు. రాహుల్ గాంధీ బృందంలోని మానికా టాగోర్, మీనాక్షి నటరాజన్ లకు మంత్రి పదవులు దక్కనున్నాయి. బెంగాల్ నుంచి ఎ.హెచ్.ఖాన్ చౌదరికి, కేరళ నుంచి కె.సురేష్ కు, ఎన్ సీపీ నుంచి తారిఖ్ అన్వర్ కు మంత్రి వర్గంలో స్థానం లభించనుందని సమాచారం. ఆనంద్ శర్మకు ప్రమోషన్ ఇస్తారు. కపిల్ సిబల్ శాఖలు యథాతథంగా ఉంటాయి. మునియప్పకు స్వతంత్ర హోదా ఇస్తారు. కమల్ నాథ్కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అప్పగిస్తారు.
ఏడుగురి రాజీనామా
కేంద్రం మంత్రి వర్గం నుంచి ఏడుగురుమంత్రులు రాజీనామా చేశారు. ఎస్.ఎం.కృష్ణ, అంబికాసోనీ, సుభోద్ కాంత్ సహాయ్, ముకుల్ వాస్నిక్, మహదేవ్ సింగ్ ఖండేలా,అగథా సంగ్మా ,విన్సెంట్ పాల రాజినామాలను ప్రధాని అమోదించారు. ఎస్.ఎం.కృష్ణ, ముకుల్ వాస్నిక్ లకు పార్టీ పదవులు అప్పగించే అవకాశం ఉంది. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంతరంగిక బృందంలోకి అంబికాసోనీని తీసుకుంటారని తెలుస్తోంది.సుభోద్ కాంత్ సహాయ్ బొగ్గు స్కాంతో పదవిని కోల్పోయారు. ఆరుగురు సీనియర్ మంత్రుల శాఖలలో కోత విధిస్తారు. రెండేసి శాఖలు ఉన్నవారి వద్ద నుంచి ఒక శాఖని తొలగిస్తారు. సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య, మిలింద్ దేవరాలకు ప్రమోషన్ ఇస్తారు. రాహుల్ గాంధీ బృందంలోని మానికా టాగోర్, మీనాక్షి నటరాజన్ లకు మంత్రి పదవులు దక్కనున్నాయి. బెంగాల్ నుంచి ఎ.హెచ్.ఖాన్ చౌదరికి, కేరళ నుంచి కె.సురేష్ కు, ఎన్ సీపీ నుంచి తారిఖ్ అన్వర్ కు మంత్రి వర్గంలో స్థానం లభించనుందని సమాచారం. ఆనంద్ శర్మకు ప్రమోషన్ ఇస్తారు. కపిల్ సిబల్ శాఖలు యథాతథంగా ఉంటాయి. మునియప్పకు స్వతంత్ర హోదా ఇస్తారు. కమల్ నాథ్కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అప్పగిస్తారు.
కావూరి అలక: ఢిల్లీ బుజ్జగింపు
న్యూఢిల్లీ,అక్టోబర్ 27: కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందని ఆశించిన ఏలూరు కాంగ్రెస్ ఎంపి కావూరి సాంబశివరావు జాబితాలో తన పేరు లేదని తెలిసి రాజీనామాకు సిద్దపడ్డారు. లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖలు పంపారు. ఆయన అయిదుసార్లు ఎంపిగా గెలిచారు. సీనియార్టీని, విధేయతని నిర్లక్ష్యం చేశారని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, నిరాశతో రాజీనామా చేసిన కావూరి సాంబశివరావును ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో గుర్తింపు ఉన్న హోదా ఇస్తామంటూ అహ్మద్ పటేల్ నచ్చచెబుతున్నప్పటికీ కావూరి మాత్రం తనకు కేంద్ర మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం.మరోవైపు గుంటూరు కాంగ్రెస్ ఎంపి రాయపాటి సాంబశివరావు కూడా కావూరి బాటలోనే నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ ఎంపి రాయపాటి టిటిడి చైర్మన్ పదవిని చాలా కాలం నుంచి ఆశించారు. కానీ ఆ పదవి దక్కకఆయన కూడా తీవ్ర అంసతృప్తితో ఉన్నారు.
Friday, October 26, 2012
శవమైన శాన్వి...ఆస్తి కోసం దగ్గర బంధువే దారుణం...
ఎస్.ఎం.కృష్ణ ...బ్యాక్ టు హోం...!
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: కేంద్ర మత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ తన పదవికి రాజినామా చేసినట్టు తెలిసింది. కర్ణాటకకు చేందిన 80 ఏళ్ళ కృష్ణ ప్రధానికి తన రాజినామా లేఖను పంపినట్టు సమాచారం. వచ్చే ఏడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఆయనకు ఆ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. లోగడ ఆయన కర్ణాటక సి.ఎం. గా పనిచేశారు. 2009 లో యు.పి.ఎ. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్.ఎం.కృష్ణ కు విదేశాంగ శాఖ అప్పగించారు.
కొత్త విదేశాంగ మంత్రి ఆనంద శర్మ ?
విదేశాంగ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎస్.ఎం. కృష్ణ స్థానంలో ప్రస్తుతం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఆనంద శర్మ నియమితులు కావచ్చని సంచారం. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఆనంద శర్మ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
కొత్త విదేశాంగ మంత్రి ఆనంద శర్మ ?
విదేశాంగ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎస్.ఎం. కృష్ణ స్థానంలో ప్రస్తుతం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఆనంద శర్మ నియమితులు కావచ్చని సంచారం. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఆనంద శర్మ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు...
చిరు, కోట్ల, బలరాం నాయక్ లకు కేంద్రంలో చోటు...?
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఆదివారం జరిగే అవకాశం ఉన్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తో పాటు , కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపి బలరాం నాయక్లకు బెర్తులు ఖరారయినట్టు సమాచారం. వారి ముగ్గురికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఫోన్ చేసి ఆదివారం అందుబాటులో ఉండాలని సూచించింది. సామాజిక వర్గం, తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో వీరిని ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన సమయంలోచిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తామనే హామీ ఉంది. అందుకే ఆయన తిరుపతి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎంపికయ్యారు.ఇక కర్నూలుతో పాటు సీమ జిల్లాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని ధీటుగా ఎదుర్కొనే ఉద్దేశ్యంలో భాగంగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి అవకాశం ఇస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, తెలంగాణ ప్రాంతంలో ఎస్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున . ఆ వర్గాన్ని ప్రభావితం చేస్తారనే భావనతో బలరాం నాయక్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. దీనితో మూడు ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించినట్టవుతుందని కూడా అదిస్థానం భావనట...
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఆదివారం జరిగే అవకాశం ఉన్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తో పాటు , కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపి బలరాం నాయక్లకు బెర్తులు ఖరారయినట్టు సమాచారం. వారి ముగ్గురికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఫోన్ చేసి ఆదివారం అందుబాటులో ఉండాలని సూచించింది. సామాజిక వర్గం, తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో వీరిని ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన సమయంలోచిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తామనే హామీ ఉంది. అందుకే ఆయన తిరుపతి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎంపికయ్యారు.ఇక కర్నూలుతో పాటు సీమ జిల్లాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని ధీటుగా ఎదుర్కొనే ఉద్దేశ్యంలో భాగంగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి అవకాశం ఇస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, తెలంగాణ ప్రాంతంలో ఎస్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున . ఆ వర్గాన్ని ప్రభావితం చేస్తారనే భావనతో బలరాం నాయక్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. దీనితో మూడు ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించినట్టవుతుందని కూడా అదిస్థానం భావనట...
Thursday, October 25, 2012
జగన్ రిమాండ్ నవంబర్ 8 వరకు పొడిగింపు
హైదరాబాద్, అక్టోబర్ 25: అక్రమాస్తుల వ్యవహారంలో వైఎస్ జగన్ రిమాండ్ను సీబీఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 8 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వాన్పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిల రిమాండ్ను కూడా వచ్చేనెల 8 వరకు పొడిగించింది. రిమాండ్ ముగియడంతో గురువారం వీరిని చంచల్గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు ఎదుట హాజరుపరిచారు.
ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్లర్ ఫైనల్కు సైనా
పారిస్, అక్టోబర్ 25: వైల్డ్ కార్డు ఎంట్రీ సాధించిన సైనా ఫ్రెంచ్ ఓపెన్లో తన జోరు కొనసాగిస్తోంది. రెండో రౌండ్లో థాయిలాండ్ క్రీడాకారిణి సప్పిరి పై 21-16, 21-13 తేడాతో సైనా విజయం సాధించి క్వార్లర్ ఫైనల్కు చేరుకుంది. ఒలింపిక్ విజయం తర్వాత ఆడిన తొలి టోర్నీ డెన్మా ర్క్ ఓపెన్ లోనే చాంపియన్గా నిలిచి దూకుడు మీద ఉన్న సైనా నెహ్వాల్ ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ను కూడా నెగ్గి ఈ ఏడాది ఐ దో టైటిల్ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది.
Tuesday, October 23, 2012
'దీపం' లబ్దిదార్లకు అదనపు సిలిండర్లు
హైదరాబాద్ , అక్టోబర్ 23: ప్రజలకు ప్రస్తుతం ఇస్తున్న ఆరు గ్యాస్ సిలిండర్లకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు సిలెండర్లను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే దీపం పథకం కింద కనెక్షన్లు ఉన్నవారికే ఈ అదనపు మూడు సిలిండర్లు లభిస్తాయని పౌర సరఫరాల మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉన్నా సబ్సిడీతో అదనపు సిలిండర్లు ఇవ్వలేమని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు.
ఎడ్యూరప్ప సొంత కుంపటి...
బెంగళూరు , అక్టోబర్ 23: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ ఎడ్యూరప్ప బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 10 తేదిన ప్రాంతీయ పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ మనగడపై అనుమానాలు వ్యక్తం చేశారు. 'బీజేపీ, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి.. డిసెంబర్ 10 తేదిన ప్రాంతీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు యోడ్యురప్ప చెప్పారు.
ఉరికి చేరువలో కసబ్...
న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ముంబై కాల్పుల ఘటనలో ఉరిశిక్ష పడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతి భవన్కు సమాచారం అందించింది. కసబ్ మెర్సీ పిటిషన్ను తోసిపుచ్చాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని కోరింది. తనకు క్షమాభిక్ష ప్రసాదించి, ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని కసబ్ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నాడు. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కసబ్ క్షమాభిక్ష పిటిషన్ను తోసిపుచ్చాలని ఇంతకు ముందు మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది.
Monday, October 22, 2012
తెలంగాణలో మొదలైన చంద్రబాబు పాదయాత్ర...
హైదరాబాద్, అక్టోబర్ 22: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా... మీకోసం పాదయాత్ర సోమవారం తెలంగాణలోకి అడుగుపెట్టింది. జిల్లాలోని రాజోలీలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. తమ పార్టీ పాలనలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని, ఈ విషయంపై తాము ఎవరితోనైనా చర్చకు సిద్ధమని అన్నారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావేనని చంద్రబాబు చెప్పారు. తెలంగాణకు కేంద్రమే పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. సామాజిక న్యాయానికి తాను కట్టుబడి ఉన్నానని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకు అండగా ఉంటానని చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తొలి సంతకం రుణమాఫీ, మలి సంతకం మద్యం గొలుసు దుకాణాల రద్దు ఫైళ్ల మీదనే అని చెప్పారు. సబ్సిడీపై 10 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు తనకు ప్రాణంతో సమానమని చెపూకొచ్చారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం : రాజ్యలక్ష్మి, మండలి బుద్ధ ప్రసాద్ లకు పదవులు
హైదరాబాద్, అక్టోబర్ 22: ఎట్టకేలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. తొలి విడతగా ఇద్దరు మాజీ మంత్రులకు పదవులు దక్కాయి. మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేదురుమల్లి రాజ్యలక్ష్మి, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా మండలి బుద్ధప్రసాద్ నియమితులయ్యారు. రాజ్యలక్ష్మి, మండలి బుద్ధ ప్రసాద్ 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరిలో రాజ్యలక్ష్మి నెల్లూరు జిల్లాకు చెందినవారు కాగా, మండలి బుద్ధప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందినవారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలిచినప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగలేదు. 2004 ఎన్నికలలో కాంగ్రెసు విజయంతో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది మందిని మాత్రమే నామినేటెడ్ పోస్టులు వరించాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రోశయ్య కూడా నామమాత్రంగానే పోస్టులను భర్తీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కాలం నుంచి నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు సాగించారు. నామినెటెడ్ పోస్టుల భర్తీని విడతలవారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్నందున సాధ్యమైనంత ఎక్కువ మందికి పదవులు కట్టబెట్టాలని సి.ఎం. భావిస్తున్నారట.
Sunday, October 21, 2012
విజయమ్మ ' బైబిల్ ' వివాదం...
హైదరాబాద్ , అక్టోబర్ 21: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాజకీయ పార్టీ సభలకు, సమావేశాలకు, యాత్రలకు బైబిల్ చేత పట్టుకొని వెళ్లడం
వివాదాస్పదమవుతోంది. విజయమ్మ రాజకీయ లబ్ధి కోసం బైబిల్ చేత పట్టుకొని వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ మొదటి నుండి విమర్శలు చేస్తోంది. తాజాగా, జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో విజయమ్మ బైబిల్ చేబూనటం వివాదస్పదమైంది. రాజకీయ కార్యక్రమాలకు ఆమె బైబిల్ను తీసుకు రావడం ఒకరకంగా తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. బైబిల్ చేతపట్టుకొని రాజకీయ యాత్రలకు రావడం ద్వారా విజయమ్మ ఒక వర్గాన్ని తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. అయితే విజయమ్మ మాత్రం బైబిల్ రాజకీయాలను ఖండించారు. తాను ఎక్కడా మత ప్రచారం చేయలేదని, తనకు మత ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదని ఆమె మీడియా సమావేశంలో అన్నారు. తాను ఎక్కడకు వెళ్లినా బైబిల్ను తీసుకు వెళ్తానని, బైబిల్ చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందన్నారు. అంత మాత్రాన తాను మత ప్రచారం చేసినట్లు కాదని ఆమె చెప్పారు. తన భర్త దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మనుషులను ప్రేమించడమే తనకు నేర్పించారని చెప్పారు. తన భర్త చనిపోయి, తన కొడుకు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినందునే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. అయితే ఆమె ఈ వార్తలను ఖండించిన తర్వాత టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ విజయమ్మ మత ప్రచారం చేసిందంటూ ఓ సిడిని విడుదల చేయడం సంచలనం రేపింది.
వివాదాస్పదమవుతోంది. విజయమ్మ రాజకీయ లబ్ధి కోసం బైబిల్ చేత పట్టుకొని వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ మొదటి నుండి విమర్శలు చేస్తోంది. తాజాగా, జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో విజయమ్మ బైబిల్ చేబూనటం వివాదస్పదమైంది. రాజకీయ కార్యక్రమాలకు ఆమె బైబిల్ను తీసుకు రావడం ఒకరకంగా తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. బైబిల్ చేతపట్టుకొని రాజకీయ యాత్రలకు రావడం ద్వారా విజయమ్మ ఒక వర్గాన్ని తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. అయితే విజయమ్మ మాత్రం బైబిల్ రాజకీయాలను ఖండించారు. తాను ఎక్కడా మత ప్రచారం చేయలేదని, తనకు మత ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదని ఆమె మీడియా సమావేశంలో అన్నారు. తాను ఎక్కడకు వెళ్లినా బైబిల్ను తీసుకు వెళ్తానని, బైబిల్ చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందన్నారు. అంత మాత్రాన తాను మత ప్రచారం చేసినట్లు కాదని ఆమె చెప్పారు. తన భర్త దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మనుషులను ప్రేమించడమే తనకు నేర్పించారని చెప్పారు. తన భర్త చనిపోయి, తన కొడుకు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినందునే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. అయితే ఆమె ఈ వార్తలను ఖండించిన తర్వాత టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ విజయమ్మ మత ప్రచారం చేసిందంటూ ఓ సిడిని విడుదల చేయడం సంచలనం రేపింది.
యష్ చోప్రా నో మోర్...
ముంబై, అక్టోబర్ 21: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత యష్ చోప్రా ఆదివారం సాయంత్రం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన కొద్ది రోజుల నుంచి డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారు. షారుఖ్ ఖాన్ తో తీసిన జబ్ తక్ హై జాన్ ఆయన చివరి చిత్రం. సెప్టెంబర్ 27న యష్ చోప్రా తన 71వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. గతంలో ఆయన 'షోలే- ద మేకింగ్ ఆఫ్ ఎ క్లాసిక్' పుస్తకం జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకొని, పదివేల కాపీలు అమ్ముడయింది. యష్ చోప్రా దర్శకత్వం వహించిన 'దూల్ కా ఫూల్', వక్త్, డాగ్, దీవార్, కభీ కభీ, సిల్ సిలా, చాందిని, డర్, దిల్ తో పాగల్ హై, వీర్ జరా చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి.
కింగ్ఫిషర్ లెసైన్స్ నిలుపుదల
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కు తాజాగా పౌరవిమానయాన డెరైక్టరేట్ జనరల్ (డీజీసీఏ) షాకిచ్చింది. లెసైన్స్ (షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్-ఎస్వోపీ) ను నిలుపుదలచేస్తూ (సస్పెన్షన్) శనివారం ఉత్తర్వులిచ్చింది. తిరిగి ఆదేశాలు జారీ దీనితో చేసేవరకూ సస్పెన్షన్ అమలులో ఉంటుందని పౌరవిమానయాన శాఖ అధికారులు పేర్కొన్నారు. వెరసి తొమ్మిదేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కింగ్ఫిషర్... తొలిసారి విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితిలో పడింది. మూడు వారాలుగా లాకౌట్లో కొనసాగుతున్న కంపెనీ ఇటు ఆర్థికంగానూ, అటు నిర్వహణపరంగానూ ఎలాంటి ఆచరణీయ ప్రణాళికనూ సిద్ధం చేయలేకపోవడంతో డీజీసీఏ ఈ చర్యలు చేపట్టింది. లెసైన్స్ సస్పెన్షన్తో కింగ్ఫిషర్ నెట్వర్క్ తోపాటు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా జరిగే అన్ని రకాల బుకింగ్లూ నిలిచిపోనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా, భద్రతా చర్యలలో భాగంగా డీజీసీఏ కింగ్ఫిషర్ లెసైన్స్ ను నిలుపుదల చేసిందని పౌర విమానయాన మంత్రి అజిత్ సింగ్ చెప్పారు. ఇంజనీర్లు సమ్మెలో ఉన్నందున విమానాల నిర్వహణ, తత్సంబంధిత సేవలను చేపట్టడంలేదని తెలిపారు.
Thursday, October 18, 2012
డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సైనా
ఒడెన్స్ ,అక్టోబర్ 18: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ మహిళల సింగిల్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ మితాని మినత్సు (జపాన్) పై 21-15, 21-14 తో సైనా గెలిచింది.
పవర్ కోసం వీధిన పడ్డ వై.ఎస్. ఇంటి పడుచులు !
కడప,అక్టోబర్ 18: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం మధ్యాహ్నం తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. వైయస్సార్ ఘాట్ నుండి ప్రారంభమైన షర్మిల యాత్రలో తొలి రోజున జగన్ సతీమణి భారతి రెడ్డి, తల్లి విజయమ్మ పాల్గొన్నారు. షర్మిల సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు కిలోమీటర్లు నడిచారు. ట్రిపుల్ ఐటి, వీరగట్టుపల్లె, కుమ్మరాంపల్లె మీదుగా ఆమె యాత్ర కొనసాగింది. పార్టీ నేతలు శోభా నాగి రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, వాసిరెడ్డి పద్మ, రోజా తదితరులు కూడా షర్మిల వెంటఉన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి వారు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో విజయమ్మ, షర్మిల భారీ బహిరంగ సభలో మాట్లాడారు. టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కై జగన్ను జైలుకు పంపించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. షర్మిల తనను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కూతురుగా, జగన్ సోదరిగా పరిచయం చేసుకున్నారు. తన అన్న తరఫున తాను పాదయత్ర చేస్తున్నట్లు షర్మిల చెప్పారు. రాజన్న కూతురిగా..... జగనన్న చెల్లెలిగా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తున్నానని, తాను జగనన్న వదిలిన బాణాన్ని అని.... అందరూ కలిసి రావాలని షర్మిల పిలుపునిచ్చారు. జగనన్న నాయకత్వంతోనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని ఆమె అన్నారు.
Wednesday, October 17, 2012
గడ్కరీ పరమ అవినీతిపరుడు..చిట్టా విప్పిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: : అవినీతి వ్యతిరేక ఉద్యమం చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ బుధవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అవినీతి చిట్టా విప్పారు. కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ను తొలి విడతగా టార్గెట్ చేసిన కేజ్రీవాల్ ఈసారి గడ్కరీ అవినీతి ని బయటపెట్టారు. గడ్కరీని రాజకీయ నాయకుడు అనడం కంటే మంచి వ్యాపారవేత్త అనడం సబబు అన్నారు. మహారాష్ట్రలో గడ్కరీకి పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉందని ఆరోపించారు. మహారాష్ట్ర నీటిపారుదల కుంభకోణంలో గడ్కరీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. శరద్ పవార్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని గడ్కరీయే చెప్పారన్నారు. గతంలో ప్రాజెక్టు కోసమని సేకరించిన భూమిలో చాలా మిగిలి పోయిందని, మిగిలిన ఆ భూమిని తనకు అప్పగించాలని రైతులు 2002లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని, అయితే ప్రభుత్వం మాత్రం వారి విజ్ఞప్తులను పట్టించుకోలేదన్నారు. 2005లో గడ్కరీ ఆ భూములను తనకు ఇవ్వాల్సిందిగా లేఖ రాస్తే విలాస్ రావు దేశ్ ముఖ్ ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు. నాగపూర్ రైతుల భూములను గడ్కరీకి ప్రభుత్వం ధారాదత్తం చేసిందన్నారు. రైతుల ప్రాణాలు ఫణంగా పెట్టి గడ్కరీ మహా ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందారని ఆరోపించారు. విదర్భ రైతుల దుస్థితికి ఆయనే కారణమన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నుండి గడ్కరీ చాలా ప్రయోజనాలు పొందారని చెప్పారు. గడ్కరీకి ఐదు చక్కెర కర్మాగారాలు, మూడు విద్యుత్ పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. విద్యుత్, చక్కెర పరిశ్రమలకు ప్రభుత్వం అక్రమంగా నీటిని ఇచ్చిందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయించారన్నారు. గడ్కరీకి వంద ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించారని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో గడ్కరీ తన ప్రయోజనాల కోసం కుమ్మక్కయ్యారన్నారు. గడ్కరీ విద్యుత్ పరిశ్రమల కాలుష్యం పైన ఫిర్యాదు చేసినా పట్టించుకో లేదన్నారు.
Tuesday, October 16, 2012
సచిన్కు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాలో సభ్యత్వం
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం సచిన్ కు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా లో సభ్యత్వాన్ని కల్పించింది. దీనికి సంబంధించి ఆ దేశ ప్రధాని జూలియా గిల్లార్డ్ ప్రకటన చేశారు. త్వరలో భారత్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా క్యాబినెట్ మినిస్టర్ సైమన్ క్రీన్ ఈ గౌరవాన్ని ప్రదానం చేస్తారు. అసాధారణ సేవలందించిన ప్రముఖులను లేదా ఆస్ట్రేలియా పౌరులను ఈ గౌరవంతో సత్కరిస్తారు. ఆరు గ్రేడ్లు ఉన్న ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాలో సచిన్ను సభ్యత్వంతో గౌరవించనున్నారు. గతంలో ఈ గౌరవాన్ని అందుకున్న క్రికెటర్లలో బ్రియాన్ లారా ఉన్నారు. వెస్టిండీస్కు చెందిన క్లైవ్ లాయిడ్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఆఫీసర్గా గౌరవం పొందారు.
తెలంగాణ ఒక్కటే సమస్యా ? వాయలార్
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : దేశంలో తెలంగాణ ఒక్కటే సమస్య కాదని ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వాయలార్ రవి మంగళవారం అన్నారు. తెలంగాణపై చర్చల ప్రక్రియ ఆగిపోలేదని, అందరితోనూ చర్చిస్తున్నామని, అయితే చర్చలు ఎప్పటిలోగా ముగుస్తాయో ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. కేంద్రం, కాంగ్రెసు పార్టీ కూడా సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం తో ఉన్నాయని చెప్పారు.
జీవ వైవిధ్య పరిరక్షణకు 50 మిలియన్ డాలర్లు: ప్రధాని
హైదరాబాద్, అక్టోబర్ 16: జీవ వైవిధ్య సదస్సుకు నాయకత్వం వహించే రెండేళ్ళ కాలం లో భారత్ ఇందుకు సంభందించిన ప్రాజెక్ట్ పై 50 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. జీవ వైవిధ్య పరిరక్షణకు సంస్థాగత వ్యవస్థ పటిష్టతపై ఈ నిధులు వెచ్చిస్తామన్నారు. హైదరాబాదులో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సులో మంగళవారం నాడు ప్రధాని పాల్గొన్నారు. జీవ వైవిధ్య ప్రాధాన్యత భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని మన్మోహన్ సింగ్ అన్నారు. జీవ వైవిధ్య ప్రాధాన్యతను ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తున్నాయని చెప్పారు. పర్యావరణ ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన క్రమంగా ఏర్పడుతోందన్నారు. జీవ వైవిధ్యం పై 2010 లక్ష్యాలను చేరుకోలేక పోయామని, ప్రకృతి నుండి కనుమరుగు అవుతున్న జంతువులను పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రధాని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పర్యావరణమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద విజ్ఞానాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు వాడుతున్న విత్తనాల పేటెంట్ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. భారత దేశంలో 600 పర్యావరణ పరిరక్షణ ప్రాంతాలు ఉన్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పశు సంపద కూడా ముఖ్యమేనని అన్నారు. 105 పేటెంట్ హక్కులపై భారతదేశం విజయం సాధించిందని, వన్యప్రాణుల రక్షణ కోసం చట్టాలని కఠినతరం చేశామని చెప్పారు. సాంప్రదాయ పంటలను కాపాడుకోవాలన్నారు. నగోయా ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. నగోయా ప్రొటోకాల్ ను భారత్ అమలులోకి తెచ్చిందని చెప్పారు. తొలుత జీవవైవిద్యానికి గుర్తుగా ప్రధాన మంత్రి పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు.
Sunday, October 14, 2012
షిర్డీ సాయి కానుకల వేలం
షిర్డీ, అక్టోబర్ 14: షిర్డీ సాయిబాబా ఆలయానికి భక్తులు సమర్పించిన విలువైన కానుకలను ఈ నెల 18 నుంచి వేలం వేయనున్నట్టు శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది. వీటిలో వెండి, బంగారు, రత్నాలు, వజ్రాలు, ఖరీదైన రాళ్లతో తయారైన కిరీటాలు, హారాలు, పాదుకలు తదితర వస్తువులున్నాయి. మొత్తం 32 కేజీల వెండి, 18 కేజీల బంగారు కానుకలు, 52 విలువైన రత్నాలు, వజ్రాలను వేలం వేయనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి తెలిపారు. 18న వెండి, వచ్చే నెల 1న బంగారు, 8న విలువైన రాళ్లను వేలం వేస్తామన్నారు. ఇందులో పాల్గొనే వారు రూ.10 వేల రీఫండబుల్ డిపాజిట్ను చెల్లించాల్సి ఉంటుంది . సాయి కి వచ్చిన కానుకలను కొనుక్కోవడానికి భక్తులు మొగ్గచూపడంతో వాటిని కరిగించకుండా వేలం వేస్తున్నారు.
Saturday, October 13, 2012
లోక్సభ ఉపఎన్నికలో ప్రణబ్ తనయుని గెలుపు
కోల్ కతా, అక్టోబర్ 13: పశ్చిమ బెంగాల్ లోని జంగీపూర్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ స్వల్ప మైజార్టీతో గెలుపొందారు. సమీప సీపీఎం అభ్యర్థి ముజాఫర్ హుస్సేన్ పై 2,536 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అభిజిత్ కు 3,32,919 ఓట్లు రాగా, హుస్సేన్ కు 3,30,383 ఓట్లు వచ్చాయి. 2009లో ఇక్కడ నుంచి పోటీ చేసిన ప్రణబ్ ముఖర్జీ 1.28 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
2011 నంది అవార్డులు : ఉత్తమ నటుడు మహేష్ బాబు...ఉత్తమ నటి నయనతార
హైదరాబాద్, అక్టోబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులను శనివారం ప్రకటించారు. 2011 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా మహేష్ బాబు(దూకుడు) ఎంపిక కాగా, ఉత్తమ నటిగా నయనతార (శ్రీరామ రాజ్యం), ఉత్తమ చిత్రంగా శ్రీరామ రాజ్యం ఎంపికయింది. ఉత్తమ దర్శకుడిగా ఎన్ శంకర్ (జైబోలో తెలంగాణ) ఎంపికయ్యారు. ఇతర అవార్డుల వివరాలు: ఉత్తమ విలన్ : మంచు లక్ష్మి (అనగనగా ఒక ధీరుడు), ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న, ఉత్తమ తృతీయ చిత్రం : విరోధి, ఉత్తమ గాయకుడు : గద్దర్ (జై బోలో తెలగాణ చిత్రంలోని పొడుస్తున్న పొద్దుమీద ), ఉత్తమ గాయని: మాళవిక (రాజన్న), ఉత్తమ సంగీత దర్శకుడు : ఇళయరాజా (శ్రీరామ రాజ్యం), ఉత్తమ కుటుంబ కథాచిత్రం : 100% లవ్, ఉత్తమ హాస్య నటుడు : ఎంఎస్ నారాయణ(దూకుడు), ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (దూకుడు), ఉత్తమ పిల్లల చిత్రం : శిఖరం, ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం : అవయవదానం, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : సమ్మెట గాంధీ(రాజన్న), ఉత్తమ సహాయనటి : రత్నసాగరి(కారాలు మిర్యాలు), ఉత్తమ బాల నటుడు : నికిల్ (100% లవ్), ఉత్తమ బాల నటి : బేబి ఆని(రాజన్న), ఉత్తమ మాటల రచయిత : నీలకంఠ (విరోధి), స్పెషల్ జ్యూరీ అవార్డ్ (మేల్): అక్కినేని నాగార్జున (రాజన్న), స్పెషల్ జ్యూరీ అవార్డ్ (ఫిమేల్ ) : చార్మి (మంగళ), ఉత్తమ గేయ రచిత : సురేందర్ (పోరు తెలంగాణ), ఉత్తమ స్క్రీన్ ప్లే : శ్రీను వైట్ల(దూకుడు).
Friday, October 12, 2012
ఐపీఎల్లో స్థానం కోల్పోయిన డెక్కన్ చార్జర్స్
ముంబయి,అక్టోబర్ 12: ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ స్థానం కోల్పోయింది. ముంబయి హైకోర్టు ముందు రు. 100 కోట్లు బ్యాంకు గ్యారంటీని గడువులోగా చెల్లించనందున డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గతంలో డెక్కన్ చార్జర్స్ కాంట్రాక్టును రద్దు చేస్తూ బీసీసీఐ ప్రకటించడంతో ప్రాంచైజీ యాజమాన్యం డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమకు అక్టోబర్ 15 వరకూ గడువు కావాలని డెక్కన్ ప్రాంచైజీ కోరడంతో న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయస్థానం ఇచ్చిన గడువులోగా డెక్కన్ డెక్కన్ చార్జర్స్ బ్యాంకు గ్యారంటీని చెల్లించకపోవడంతో తదుపరి ఐపీఎల్లో స్థానం కోల్పోయింది.
తెలంగాణపై షిండే మాటకే అజాద్ ఓటు...
హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ చాలా జఠిలమైన అంశమని ఆయన అన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతోనే గాక, అందరితోనూ చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఢిల్లీకి ఎవరు వచ్చినా మాట్లాడుతామని ఆయన అన్నారు. మంత్రులు, శానససభ్యులతో మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణపై రెండేళ్ల నుంచి చర్చలు జరుపుతున్నామని , ఏకాభిప్రాయ సాధన వరకు నిర్ణయం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఎవరికి వారు వాదనలు వినిపిస్తున్నారు గానీ ఏకాభిప్రాయం రావడం లేదని ఆయన అన్నారు.ఎంపి, బీహార్, యుపి విభజన మాదిరిగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి వీలు కాదని అన్నారు. కాగా, తెలంగాణపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని, ఈ సమస్యపై పరిష్కారం ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమని కేంద్ర హోం మంత్రి షిండే రెండు రోజుల క్రితమే స్పష్టం చేసిన విషయం విదితమే.
Thursday, October 11, 2012
మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్పోర్టులు
హైదరాబాద్, అక్టోబర్ 11: రాష్ట్రంలో మరో రెండు మినీ పాస్పోర్టు సేవా కేంద్రాలను నెలకొల్పనున్నట్టు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి డాక్టర్ శ్రీకర్రెడ్డి వెల్లడించారు. కరీంనగర్, భీమవరంలలో 4 నెలల్లోనే వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆధార్కార్డు అమలులోకి వస్తే పాస్పోర్టు జారీ ప్రక్రియ మరింత సులభతరమవుతుందని చెప్పారు. స్థానిక పోలీసు విచారణలో జాప్యం కారణంగానే పాస్పోర్టు జారీ ఆలస్యమవుతోందని తెలిపారు. తత్కాల్ కింద కేవలం మూడు రోజుల్లోనే పాస్పోర్టు జారీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. పాస్పోర్టు కోసం ఏజెన్సీలను సంప్రదించి మోసపోవద్దని దరఖాస్తుదారులకు శ్రీకర్రెడ్డి సూచించారు. ఏజెన్సీలు నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలు చేసి పాస్పోర్టులు అందజేస్తున్నాయని, ఈ విషయం విచారణలో బయటపడితే దరఖాస్తుదారులే ఇబ్బంది పడతారని హెచ్చరించారు.
'తెహల్కా' బంగారు కు బెయిల్...
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: తెహల్కా కేసులో నిందితుడైన భారతీయ జనతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, దళిత నేత బంగారు లక్ష్మణ్ కు ఢిల్లీ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు రూ.50వేల పూచికత్తుతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఆయుధ డీలర్ల నుంచి లక్ష రూపాయిలు లంచం తీసుకుంటూ తెహల్కా డాట్ కామ్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో బంగారు లక్ష్మణ్ పట్టుబడిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్ నుంచి బంగారు లక్ష్మణ్ జైలులో ఉన్నారు.
వై.ఎస్. ఫ్యామిలీ మరో ప్రజా ప్రస్థానం...18 నుంచి షర్మిల పాదయాత్ర...
హైదరాబాద్, అక్టోబర్ 11: : రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తన కూతురు షర్మిల పాదయాత్ర చేస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తెలిపారు. షర్మిల పాదయాత్రను ప్రారంభిస్తుందని, తరువాత జగన్ బెయల్ పై విడుదలయి వస్తే ఆయన పాదయాత్రను కొనసాగిస్తారని విజయమ్మ చెప్పారు. ఈ పాదయాత్రను జగన్ చేపట్టాలనుకున్నారని కానీ, ఆయన జైలుకు వెళ్లడంతో షర్మిల చేపట్టేందుకు సిద్ధపడిందని చెప్పారు. తన ఆరోగ్యం దృష్ట్యా తనను వద్దని పార్టీలోని పెద్దలు సూచించారన్నారు. జగన్ స్థానంలో ఎవరో ఒకరు పాదయాత్ర చేయాలని చర్చించుకుంటున్న సమయంలో షర్మిల అందుకు సిద్ధపడ్డారన్నారు. పాదయాత్ర మధ్యలో తాను, జగన్ సతీమణి భారతి రెడ్డి అప్పుడప్పుడు పాలు పంచుకుంటామన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ప్రజల్లోకి వెళుతున్నామని చెప్పారు. అందుకే ఆయన ప్రజా ప్రస్థానం పేరుతో యాత్ర చేస్తే షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో యాత్ర చేస్తారన్నారు. తెలంగాణ జిల్లాల్లో కూడా యాత్ర ఉంటుందని చెప్పారు. చంద్రబాబు యాత్రకు తమ యాత్రకు తేడా ఉంటుందన్నారు. ఆయనపై ప్రజలకు విశ్వాసం లేదని, కానీ తమ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. ఈ నెల 18న ఇడుపులపాయ నుండి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వరకు సాగుతుంది.ఇచ్చాపురంలో ముగుస్తుంది.
Wednesday, October 10, 2012
తెలంగాణ పరిష్కారం ఎప్పుడో చెప్పలేం : షిండే
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తాము తెలంగాణ అంశంపై చర్చించ లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోమని షిండే స్పష్టం చేశారు. కెసిఆర్తో తెలంగాణ అంశంపై తాను ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. తెలంగాణపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని చెప్పారు. కేంద్రం ప్రక్రియను కొనసాగిస్తోందని, అయితే ఈ సమస్యపై పరిష్కారం ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు.
తెలంగాణ రాదని తేలిపోయింది: లగడపాటి
కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనతో తెలంగాణ రాదని తేలిపోయిందని ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని అన్నారు.
తెలంగాణ రాదని తేలిపోయింది: లగడపాటి
కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనతో తెలంగాణ రాదని తేలిపోయిందని ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని అన్నారు.
Tuesday, October 9, 2012
ముందంజలో మిట్ రోమ్నీ
వాషింగ్టన్,అక్టోబర్ 9: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగమైన తొలి బహిరంగ చర్చలో అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ముందంజలో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ తాజా సర్వేలోనూ దూసుకుపోయారు. ఒబామాకు 45 శాతం మంది మద్దతు పలకగా, రోమ్నీకి 49 శాతం మంది మద్దతు పలికారు. అక్టోబర్ 3న జరిగిన చర్చ అనంతరం ఈ సర్వేను నిర్వహించారు. అంతకుముందు జరిపిన సర్వేల్లో వెనుకబడి ఉన్న రోమ్నీ చర్చ తర్వాత ముందుకు దూసుకొచ్చారు.
కొత్తగ్యాస్ కనెక్షన్ల డిపాజిట్ పెంపు
హైదరాబాద్,అక్టోబర్ 9: కొత్త గ్యాస్ కనెక్షన్లకు డిపాజిట్ పెంచుతూ చమురు కంపెనీలు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటివరకు సింగిల్ సిలిండర్ కనెక్షన్కు రూ.1,250తో పాటు రెగ్యులేటర్ చార్జీ కింద రూ.150 వసూలు చేస్తుండగా, తాజాగా సింగిల్ సిలిండర్ డిపాజిట్ను రూ. 1,450కు పెంచారు. రెగ్యులేటర్తో కలిపితే ఇది రూ.1,600 అవుతుంది. రెండో సిలిండర్ తీసుకోవాలంటే మరో రూ.1,450 చెల్లించాలని గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. మూడేళ్లక్రితం సిలిం డర్ డిపాజిట్ రూ.900 ఉండేది. దాన్ని తర్వాత రూ. 1,250కు పెంచారు. ఇప్పుడిది రూ.1,450 అయ్యింది.
ఎంబీఏ, ఎంసీఏ ఫీజుల పెంపు... 12 నుంచి కౌన్సిలింగ్
హైదరాబాద్,అక్టోబర్ 9: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజులను భారీగా పెంచారు.. రెండు కోర్సులలో కనీస ఫీజుని 27 వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంసీఏ గరిష్ట ఫీజు 88 వేల రూపాయలు, ఎంబీఏ గరిష్ట ఫీజు 71వేల రూపాయలకు పెంచారు. మొత్తం 48 ఎంబీఏ కాలేజీల్లో, 36 ఎంసీఏ కాలేజీలకు ఫీజుల పెంపు వర్తిస్తుంది. ఈ నెల 12 నుంచి రెండు కోర్సులకు ఆన్లైన్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
Monday, October 8, 2012
వరల్డ్ టీ-20 జట్టులో కోహ్లీ, రైనా
కొలంబో, అక్టోబర్ 8: వరల్డ్ టీ-20 జట్టును ఐసీసీ ప్రకటించింది. కెప్టెన్గా జయవర్ధనేను ఎంపిక చేశారు. జట్టులో విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలకు స్థానం దక్కింది.
ఇలావుండగా, ట్వంటీ 20 ప్రపంచ కప్ను శ్రీలంక జారవిడుచుకున్న నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని మహేలా జయవర్ధనే నిర్ణయించుకున్నారు. నాలుగు ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన మహేలా జయవర్ధనే తన దేశానికి కప్ అందించడంలో మాత్రం విఫలమయ్యారు. తాను సెలెక్టర్లతో మాట్లాడుతానని, శ్రీలంక ట్వంటీ20 జట్టు కెప్టెన్గా తప్పుకోవాలని నిర్మయించుకున్నానని ఆయన వెస్టిండీస్పై ఓటమి తర్వాత చెప్పారు. జయవర్దనే వికెట్ మ్యాచ్ను మలుపు తిప్పింది. జయవర్ధనే కొద్దిసేపు క్రీజులో నిలబడి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది.
ఇలావుండగా, ట్వంటీ 20 ప్రపంచ కప్ను శ్రీలంక జారవిడుచుకున్న నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని మహేలా జయవర్ధనే నిర్ణయించుకున్నారు. నాలుగు ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన మహేలా జయవర్ధనే తన దేశానికి కప్ అందించడంలో మాత్రం విఫలమయ్యారు. తాను సెలెక్టర్లతో మాట్లాడుతానని, శ్రీలంక ట్వంటీ20 జట్టు కెప్టెన్గా తప్పుకోవాలని నిర్మయించుకున్నానని ఆయన వెస్టిండీస్పై ఓటమి తర్వాత చెప్పారు. జయవర్దనే వికెట్ మ్యాచ్ను మలుపు తిప్పింది. జయవర్ధనే కొద్దిసేపు క్రీజులో నిలబడి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది.
అక్కినేని అమల అరెస్టు
ముంబై, అక్టోబర్ 8: చారిత్రక కట్టడం చార్మినార్ పై పర్యావరణ పరిరక్షణ బ్యానర్లు కట్టినందుకు అక్కినేని అమలను పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్ వద్ద అనుమతి లేకుండా ఏ విధమైన బ్యానర్లు కట్టకూడదని, అయితే అమల గ్రీన్పీస్ సభ్యులతో కలిసి ఈ రూల్ ను అతిక్రమించినందున అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.కాగా, అంతర్జాతీయ జీవ వైవిథ్య సదస్సు సందర్బంగా ప్రజలలో చైతన్యం కలిగించడానికి తాము ఈ ప్రదర్సన నిర్వహించినట్లు అక్కినేని అమల చెప్పారు. కేంద్రం 13 కోల్ బ్లాక్లకు అనుమతి ఇచ్చారని, బొగ్గు తవ్వకాలు గిరిజనులను, జంతువులను నిరాశ్రయులను చేస్తున్నాయని, జంతువుల మనుగడ బొగ్గు తవ్వకాల వల్ల దెబ్బ తింటోందని అమల మీడియాతో అన్నారు.
ఆశా భోంస్లే కూతురు ఆత్మహత్య
ముంబై, అక్టోబర్ 8: ప్రముఖ గాయని ఆశా భోంస్లే కూతురు వర్షా భోంస్లే సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వర్షా భోంస్లే వయస్సు యాభయ్యేళ్లు. ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. పలు ప్రముఖ దిన పత్రికలకు కాలమిస్టుగా పని చేశారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే కాకుండా తల్లితో కలిసి పలు సంగీత కార్యక్రమాలలో వర్షా పాల్గొన్నారు. హిందీ, మరాఠీ చిత్రాలలో ప్లేబ్యాక్ సింగర్గా పని చేశారు. వర్షా భోంస్లే ఆశా భోంస్లే రెండవ కూతురు. ఆరోగ్య సమస్యలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. వర్షా నాలుగేళ్ల క్రితం 2008 లో కూడా ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు.
శ్రీలక్ష్మికి బెయిల్
హైదరాబాద్, అక్టోబర్ 8: ఓఎంసి కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరైంది. గతంలో ఆమె పలుసార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. చివరికి సోమవారం నాడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. శ్రీలక్ష్మి గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు.
Friday, October 5, 2012
సుప్రీంకోర్టులో జగన్ కు దొరకని బెయిల్...
న్యూఢిల్లీ, అక్టోబర్ 5: : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, దర్యాఫ్తు కొనసాగుతోందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని కోర్టుకు తెలిపారు. ఆయన ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్నారని, కాబట్టి సాక్ష్యులను బెదిరింపులకు గురి చేసే అవకాశముందన్నారు. బెయిల్ ఇస్తే కేసు ప్రభావితమవుతుందన్నారు. తాము నాలుగు ఛార్జీషీట్లలో మూడువేల అక్రమాస్తులను గుర్తించామని చెప్పారు. జగన్ విచారణకు సహకరిస్తే ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. మారిషస్, లగ్జెంబర్గ్ తదిదర విదేశాల ద్వారా తన కంపెనీలలోకి జగన్ నిధులు మళ్లించారన్నారు. విదేశీ నిధుల ప్రభావంపై విచారించాల్సి ఉందన్నారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన కొన్ని హవాలా మనీ మార్గాలను ఛేదించామన్నారు. సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించి, బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
అమెరికాలో ఆంధ్రవిద్యార్థి దుర్మరణం
టెక్సాస్,అక్టోబర్ 5: అమెరికాలోఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలోదుర్మరణం చెందాడు. గౌతం అనే ఈ విద్యార్థి టెక్సాక్లోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్నాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. తెనాలికి చెందిన గౌతం కొన్ని రోజుల క్రితమే అమెరికా వచ్చాడు.
వెస్టిండీస్ షాక్...అసీస్ షేక్...
కొలంబో,అక్టోబర్ 5: ప్రపంచకప్ ట్వంటీ 20లో ఆసీస్తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో వెస్టిండీస్ 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. విండీస్ విసిరిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆసీస్ 131 పరుగులకే చేతులెత్తేసింది. జాన్ బాలీ 63 పరుగులు మినహా . మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఓటమి పాలైన ఆసీస్ టోర్నీ నుంచి భారంగా నిష్ర్కమించింది. దీంతో విండీస్ తొలిసారి ప్రపంచకప్ ట్వంటీ 20ల్లో ఫైనల్కు చేరింది. విండీస్ బౌలర్లలో రామ్పాల్కు మూడు వికెట్లు లభించగా బద్రీ, పొలార్డ్లకు తలో రెండు వికెట్లు , నరైన్, శ్యామ్యూల్స్లకు చెరో వికెట్టు లభించింది. విండీస్ ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది.
Thursday, October 4, 2012
ట్వంటీ 20 ఫైనల్స్ లో శ్రీలంక
కొలంబో,అక్టోబర్ 4: ప్రపంచకప్ ట్వంటీ 20లో గురువారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 16 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లంకేయులు 140 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్థాన్ విఫలమైంది. ఓపెనర్లు హఫీజ్ (42), నజీర్ (20) పరుగులతో మంచి ఆరంభాన్నిచ్చినా, మిడిల్ ఆర్డర్ వైఫల్యం తో పాక్ 123 పరుగులకే పరిమితమయింది. చివర్లో ఉమర్ ఆక్మల్ 29 పరుగులతో రాణించినా అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. ఆరుగురు పాకిస్థాన్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. లంకేయులు పకడ్భందీగా బౌలింగ్ చేసి పాక్ను నిలువరించారు. శ్రీలంక బౌలర్లలో అత్యధికంగా హెరాత్ మూడు వికెట్లు తీయగా, మాథ్యూస్ , మెండిస్లకు తలో రెండు వికెట్లు లభించాయి.
తెలంగాణ మార్చ్ తప్పించుకోడానికే కెసిఆర్ ఢిల్లీ డ్రామా-లగడపాటి
న్యూఢిల్లీ,అక్టోబర్ 4: హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద ప్రతిపాదన పెట్టారని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, రాష్ట్ర విభజన చేయాలని కెసిఆర్ తనంత తానుగా ప్రతిపాదన పెట్టారనిఆయన అన్నారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా జరిగిన విధ్వంసంపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు 16 పేజీల నివేదిక సమర్పించిన తర్వాత లగడపాటి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కెసిఆర్ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలువలేదని, మిగతా కేంద్ర మంత్రులు మర్యాదపూర్వకంగానే కెసిఆర్తో మాట్లాడారని అన్నారు. చర్చల కోసం కెసిఆర్ను ఎవరూ పిలువలేదని, తెలంగాణ మార్ర్చ్ ను తప్పించుకోవడానికే కెసిఆర్ ఢిల్లీ వచ్చారని, గడువు ముగియగానే హైదరాబాదుకు జారుకున్నారని, మళ్లీ చర్చలంటూ బుకాయిస్తున్నారని ఆయన అన్నారు. ఏకాభిప్రాయం లేకుండా తెలంగాణ సాధ్యం కాదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సహా కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి, సుశీల్ కుమార్ షిండే వంటివారు చెప్పినా చర్చలంటూ కెసిఆర్ బుకాయిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పిందని, అందువల్ల తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని వెంటనే తేల్చి చెప్పాలని తాను హోం మంత్రిని కోరానని ఆయన అన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర విభజన జరగదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారని గుర్తు చేశారు. తెలుగు రాని మజ్లీస్ అధినేత ఓవైసీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అంటున్నారని, తెలుగు జాతికి చెందిన కొంత మంది గోడమీది పిల్లివాటంగా ఉన్నారని ఆయన వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ఉద్దేశించి అన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో ఈడి :చర్యలు : రు. 51 కోట్ల జప్తు
హైదరాబాద్,అక్టోబర్ 4: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో మనీలాండరింగ్ చట్టాల ఉల్లంఘనను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) నిర్ధారించింది. ఈ మేరకు ఈడి 51 కోట్ల రూపాయల విలువ చేసే స్థిర, చరాస్తులను జప్తు చేసింది. తాము ఆస్తులు జప్తు చేసిన సంస్థలు కుట్రల ద్వారా ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందాయని ఈడి వ్యాఖ్యానించింది. హెటిర్ డ్రగ్స్ కు చెందిన 35 ఎకరాల భూమిని, 3 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. అలాగే జననీ ఇన్ఫ్రాకు చెందిన 13 ఎకరాల భూములను కూడా జప్తు చేసింది. వైయస్ జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్ సంస్థకు చెందిన 14.5 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. అరబిందో ఫార్మాకు చెందిన 96 ఎకరాల భూమిని, 3 కోట్ల రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. వైయస్ జగన్ అక్రమంగా ఆస్తులను సంపాదించుకోవడానికి ఈ సంస్థలు సహకరించాయని ఈడి ఆరోపించింది. జగన్తో పాటు మరో 73 మంది నిందితులపై కూడా ఈడి దర్యాప్తు సాగిస్తోంది.
Wednesday, October 3, 2012
నవంబర్లో హిమాచల్, డిసెంబర్లో గుజరాత్ ఎన్నికలు
న్యూఢిల్లీ,అక్టోబర్ 3: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. 182 స్థానాలు కలిగిన గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 13, డిసెంబర్ 17 తేదీలలో రెండు దఫాల్లో ఎన్నికలు జరుగుతాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలకు నవంబర్ 4న ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. రెండు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు డిసెంబరు 20 చేపట్టనున్నట్టు ఈసీ తెలిపింది. గుజరాత్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 17తోనూ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 10 తోనూ ముగియనున్నాయి.
చర్చలు జరిపా...తెలంగాణా వచ్చెస్తుంది: కె.సి.ఆర్.
న్యూఢిల్లీ,అక్టోబర్ 3: కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో జరిపిన చర్చలు ఫలఫ్రదంగా ముగిశాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. బుధవారం హైదరాబాదు బయలుదేరే ముందు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. పలువురు నేతలతో తాను తెలంగాణ అంశంపై చర్చించానని, త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. మీడియాకు తెలిసి కొందరితోనే భేటీ అయ్యానని కానీ, తెలియకుండా చాలామందితో చర్చించానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఆహ్వానం మేరకే తాను ఢిల్లీకి వచ్చానన్నారు. గత నెల నాలుగో తారీఖున పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన కె.సి.ఆర్. పార్లమెంటు సమావేశాలు రెండు రోజులే జరిగినప్పటికీ అప్పటి నుండి నెల రోజుల పాటు అక్కడే ఉండిపోయారు.
Tuesday, October 2, 2012
గెలిచినా తప్పని నిష్క్రమణ...
రన్రేట్ లేక సెమీస్కు చేరని టీమిండియా..
కొలంబో,అక్టోబర్ 2: ప్రపంచకప్ ట్వంటీ 20నుంచి భారత్ నిష్ర్కమించింది. సూపర్ఎయిట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోవిజయం సాధించినప్పటికీ రన్రేట్ ప్రకారం సెమీస్కు చేరలేక ఇంటిముఖం పట్టాల్సివచ్చింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్ -దక్షిణాఫ్రికాకు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రన్రేట్ ప్రకారం భారత్ సెమీస్కు చేరాలంటే 121 పరుగులకు సఫారీలను నియంత్రించాలి. అయితే సఫారీలను నియంత్రించడంలో టీమిండియా ఆటగాళ్లు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా 19.5 ఓవర్లలో 151 పరుగులు చేసింది. ప్లెస్సీ అత్యధికం గా 65 పరుగులు చెసి బారత్ సెమీస్ ఆశలపై నీళ్ళు చల్లాడు. దీనితో గ్రూప్-1 నుంచి శ్రీలంక , వెస్టిండీస్లు సెమీస్కు అర్హత సాధించగా, గ్రూప్-2 నుంచి ఆసీస్, పాకిస్తాన్ సెమీస్కు చేరాయి.
కొలంబో,అక్టోబర్ 2: ప్రపంచకప్ ట్వంటీ 20నుంచి భారత్ నిష్ర్కమించింది. సూపర్ఎయిట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోవిజయం సాధించినప్పటికీ రన్రేట్ ప్రకారం సెమీస్కు చేరలేక ఇంటిముఖం పట్టాల్సివచ్చింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్ -దక్షిణాఫ్రికాకు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రన్రేట్ ప్రకారం భారత్ సెమీస్కు చేరాలంటే 121 పరుగులకు సఫారీలను నియంత్రించాలి. అయితే సఫారీలను నియంత్రించడంలో టీమిండియా ఆటగాళ్లు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా 19.5 ఓవర్లలో 151 పరుగులు చేసింది. ప్లెస్సీ అత్యధికం గా 65 పరుగులు చెసి బారత్ సెమీస్ ఆశలపై నీళ్ళు చల్లాడు. దీనితో గ్రూప్-1 నుంచి శ్రీలంక , వెస్టిండీస్లు సెమీస్కు అర్హత సాధించగా, గ్రూప్-2 నుంచి ఆసీస్, పాకిస్తాన్ సెమీస్కు చేరాయి.
ఆస్ట్రేలియాపై పాక్ విజయం,,,భారత్ కు సంకటం
కొలంబో,అక్టోబర్ 2: ఐసీసీ ప్రపంచకప్ ట్వంటీ 20 టోర్నమెంట్ సూపర్ 8 రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ విజయం సాధించి సెమీఫైనల్ ఆశల్ని సజీవంగా ఉంచుకొంది. పాకిస్థాన్ నిర్ధేశించిన 150 పరుగుల విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులకు చేసింది. దాంతో పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హస్సీ 54 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ తొలుత చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. పాకిస్థాన్ జట్టులో అత్యధికంగా నాసిర్ జెమ్ షెడ్ 55, కమ్రాన్ అక్మల్ 32, అబ్దుల్ రజాక్ 22 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్క్ 3, దోహర్తి, వాట్సన్, కమిన్స్ చెరో వికెట్ తీశారు. ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీ ఫైనల్కు చేరిన ఆస్ట్రేలియా కు ఈ ఓటమి వల్ల ప్రమాదమేమీ లేదు. కానీ, ఇందువల్ల భారత్ దక్షిణాఫ్రికాపై తప్పనిసరిగా మంచి రన్ రేటుతో గెలవాల్సి ఉంటుంది.
నవంబర్ 26న కేజ్రీవాల్ పార్టీ...విజన్ డాక్యుమెంట్ సిద్ధం ...
విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తున్న కేజ్రీవాల్ |
Monday, October 1, 2012
ప్రపంచకప్ ట్వంటీ 20లో ఇంగ్లండ్ ఇంటికి...
పల్లెకలె,అక్టోబర్ 1: ప్రపంచకప్ ట్వంటీ 20లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కథ ముగిసింది. సూపర్ఎయిట్లో శ్రీలంకతో తలపడిన ఇంగ్లండ్ 19 పరుగుల తేడాతో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్ర్కమించింది. 170 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ 150 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఒక్క పటేల్(67) పరుగుల మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. చివర్లో స్వాన్ (34) పరుగలతో రాణించినా ప్రయోజనం లేక పోయింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. గ్రూప్-1 నుంచి శ్రీలంక, వెస్టిండీస్లు సెమీస్కు అర్హత సాధించగా, కివీస్, ఇంగ్లండ్లు ఇంటిదారి పట్టాయి. వరుస మూడు మ్యాచ్ల్లో విజయం సాధించిన శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతోంది.
కింగ్ఫిషర్ కు తాత్కాలికంగా తాళం
ఢిల్లీ,అక్టోబర్ 1: కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆ సంస్థ సోమవారం రాత్రి తెలిపింది.గత కొంత కాలంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కింగ్ఫిషర్ సేవలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు సంస్ధ యజమాని విజయమాల్యా తెలిపారు. కింగ్ఫిషర్ ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో సమస్యను ఒక కొలిక్కి తీసుకు వచ్చే క్రమంలో యాజమన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎఫ్.డి.ఐ. లపై యుద్ధం చేస్తాం: మమత
న్యూఢిల్లీ, ,అక్టోబర్ 1: మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలను చేపట్టడానికి సిద్ధపడుతున్నట్లు తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. యుపిఎ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెసు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాల్లో తాము యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఎఫ్డిఐల విషయంలో యుపిఎ ప్రభుత్వం లక్ష్మణరేఖను దాటిందని వ్యాఖ్యానించారు. ఎఫ్డిఐల అనుమతి వల్ల ఉద్యోగాలు పోతాయని, లఘు పరిశ్రమలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆమె అన్నారు. జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు.
మద్దతిస్తాం: కరుణానిధి
మరోవైపు ,రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీర్మానం తీసుకువస్తే... తాము మద్దతిస్తామని డీఏంకే అధినేత కరుణానిధి స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ తీసుకునే నిర్ణయం కాంగ్రెస్ తో ఉన్న సంబంధాలపై అంతగా ప్రభావం చూపదని కరుణానిధి అన్నారు. ఎఫ్ డీఐలకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఓటు వేస్తామన్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రధాని మన్మోహన్ నిర్ణయాలు తీసుకుంటారని కరుణానిధి ఆశాభావం వ్యక్తం చేశారు.
మద్దతిస్తాం: కరుణానిధి
మరోవైపు ,రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీర్మానం తీసుకువస్తే... తాము మద్దతిస్తామని డీఏంకే అధినేత కరుణానిధి స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ తీసుకునే నిర్ణయం కాంగ్రెస్ తో ఉన్న సంబంధాలపై అంతగా ప్రభావం చూపదని కరుణానిధి అన్నారు. ఎఫ్ డీఐలకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఓటు వేస్తామన్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రధాని మన్మోహన్ నిర్ణయాలు తీసుకుంటారని కరుణానిధి ఆశాభావం వ్యక్తం చేశారు.
మెగా జీవ వైవిధ్య కేంద్రంగా భారత్ : జయంతీ నటరాజన్
హైదరాబాద్ లో జీవ వైవిద్య సదస్సు ప్రారంభం...
హైదరాబాద్,అక్టోబర్ 1: హైదరాబాద్ లో 19 రోజులపాటు జరిగే 11వ జీవ వైవిద్య సదస్సును కేంద్ర పర్యావరణ శాఖమంత్రి జయంతీ నటరాజన్ సోమవారం ప్రారంభించారు. భారతదేశం మెగా జీవ వైవిధ్య కేంద్రంగా అవతరిస్తోందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఆధునికీకరణ, వాతావరణ మార్పుల వల్ల జీవ వైవిధ్యానికి ముప్పు పొంచి ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. జీవ వైవిధ్యంపై హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సదస్సుకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. మానవ ఆరోగ్య మెరుగుదల కోసం జీవ సమతౌల్యం అవసరమని తెలిపారు. జీవ వైవిధ్యాన్ని కాపాడే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులను ఎలా ఎదుర్కొవాలనే అంశాన్ని సదస్సులో చర్చిస్తారని, భవిష్యత్ ప్రణాళికలపై నిర్ణయాలు తీసుకుంటారని జయంతీ నటరాజన్ పేర్కొన్నారు. జీవ వైవిధ్యంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయని, ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నాయని, అవి మరింత విస్తృతం కావాలని ఆమె ఆకాంక్షించారు. సవాళ్లను ఎదుర్కొని జీవ వైవిధ్యాన్ని భావి తరాలకు అందించాల్సిన ప్రాముఖ్యతను జయంతీ నటరాజన్ నొక్కిచెప్పారు.ఈ సదస్సులో 190 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. జీవ వైవిధ్యంపై ఇప్పటివరకు పది సదస్సులు జరగగా ప్రస్తుతం పదకొండో సదస్సు జరుగుతోంది. రెండేళ్ల కిందట ఈ జీవ వైవిధ్య సదస్సుకు జపాన్ లోని నగోయ నగరం ఆతిథ్యం ఇచ్చింది. గవర్నర్ నరసిం హన్ మాట్లాడుతూ, మానవ చరిత్రలో పర్యావరణానికి చాలా ప్రాముఖ్యత ఉందని, అనారోగ్యాలు, ఆకలి సమస్యలను అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. భూగర్భ జల వనరులు అడుగంటిపోవడం, సాగు భూములు తగ్గుదలపై సదస్సులో చర్చించి సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.
హైదరాబాద్,అక్టోబర్ 1: హైదరాబాద్ లో 19 రోజులపాటు జరిగే 11వ జీవ వైవిద్య సదస్సును కేంద్ర పర్యావరణ శాఖమంత్రి జయంతీ నటరాజన్ సోమవారం ప్రారంభించారు. భారతదేశం మెగా జీవ వైవిధ్య కేంద్రంగా అవతరిస్తోందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఆధునికీకరణ, వాతావరణ మార్పుల వల్ల జీవ వైవిధ్యానికి ముప్పు పొంచి ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. జీవ వైవిధ్యంపై హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సదస్సుకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. మానవ ఆరోగ్య మెరుగుదల కోసం జీవ సమతౌల్యం అవసరమని తెలిపారు. జీవ వైవిధ్యాన్ని కాపాడే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులను ఎలా ఎదుర్కొవాలనే అంశాన్ని సదస్సులో చర్చిస్తారని, భవిష్యత్ ప్రణాళికలపై నిర్ణయాలు తీసుకుంటారని జయంతీ నటరాజన్ పేర్కొన్నారు. జీవ వైవిధ్యంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయని, ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నాయని, అవి మరింత విస్తృతం కావాలని ఆమె ఆకాంక్షించారు. సవాళ్లను ఎదుర్కొని జీవ వైవిధ్యాన్ని భావి తరాలకు అందించాల్సిన ప్రాముఖ్యతను జయంతీ నటరాజన్ నొక్కిచెప్పారు.ఈ సదస్సులో 190 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. జీవ వైవిధ్యంపై ఇప్పటివరకు పది సదస్సులు జరగగా ప్రస్తుతం పదకొండో సదస్సు జరుగుతోంది. రెండేళ్ల కిందట ఈ జీవ వైవిధ్య సదస్సుకు జపాన్ లోని నగోయ నగరం ఆతిథ్యం ఇచ్చింది. గవర్నర్ నరసిం హన్ మాట్లాడుతూ, మానవ చరిత్రలో పర్యావరణానికి చాలా ప్రాముఖ్యత ఉందని, అనారోగ్యాలు, ఆకలి సమస్యలను అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. భూగర్భ జల వనరులు అడుగంటిపోవడం, సాగు భూములు తగ్గుదలపై సదస్సులో చర్చించి సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.
Subscribe to:
Posts (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
కమిటీ చైర్మన్గా కిషోర్ చంద్రదేవ్ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24: టెలికాం శాఖలో జరిగిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్పై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమి...