Friday, November 25, 2022

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏడుగురి పేర్లతో సీబీఐ తొలి ఛార్జిషీట్‌

న్యూఢిల్లీ, నవంబర్ 26: ఢిల్లీ మద్యం కుంభకోణంలో తొలి ఛార్జిషీట్‌ దాఖలైంది. అభిషేక్​ బోయినపల్లి, విజయ్​ నాయర్​ సహా ఏడుగురి పేర్లను సీబీఐ తన ఛార్జిషీట్​లో నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి తాము ఈ ఏడాది ఆగస్టు 17న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని పేర్లను మాత్రమే తొలి ఛార్జిషీటులో నమోదు చేసినట్లు సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించింది.

.ఏ1: కుల్‌దీప్‌ సింగ్‌, దిల్లీ ఆబ్కారీ శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్‌

ఏ2: నరేందర్‌ సింగ్‌, దిల్లీ ఆబ్కారీ శాఖ మాజీ అసిస్టెంట్‌ కమిషనర్‌

ఏ3: విజయ్‌నాయర్‌, ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌ఛార్జి

ఏ4: బోయినపల్లి అభిషేక్‌, హైదరాబాద్‌ వ్యాపారి

ఏ5: ముత్తా గౌతమ్‌, ఇండియా ఏహెడ్‌ అధినేత

ఏ6: అరుణ్‌ రామచంద్ర పిళ్లై, రాబిన్‌ డిస్టిలరీస్‌ 

ఏ7: సమీర్‌ మహేంద్రు, ఇండో స్పిరిట్‌ యజమాని

విచారణ ప్రారంభమైన 60 రోజుల తర్వాత ఛార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉండడంతో.. తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. . ‘‘మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతిపై 10 మంది మద్యం లైసెన్సుదారులు, వారి సహచరులు, ఈ దందాతో సంబంధమున్న ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. ఆబ్కారీ విధానంలో సవరణలు, లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాల కల్పన, లైసెన్సు రుసుములో మినహాయింపు/రాయితీ, ఆమోదించకుండానే ఎల్‌-1 లైసెన్సు పొడిగింపు తదితర విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఖాతా పుస్తకాల్లో తప్పుడు వివరాల నమోదుతో సంపాదించిన దానిలో కొంత మొత్తం ప్రభుత్వ అధికారులకు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల నుంచి మళ్లించారు. నిందితులకు సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించి విలువైన రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతుంది’’ అని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సీబీఐ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 30న నిర్ణయం తీసుకుంటామని ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ తెలిపారు.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...