Saturday, November 5, 2022

ఈత కెళ్ళి ఆరుగురు మృత్యువాత ..

​మేడ్చల్, నవంబర్ 5: మేడ్చల్ జిల్లా మల్కారంలోని ఎర్రగుంట చెరువులో కొడదామని వెళ్ళిన ఆరుగురు అందులో పడి చనిపోయారు. మృతులు కాచిగూడలోని అడ్జి కార్ఖానాలోని మదర్సాకు చెందినవారిగా గుర్తించారు. కాచిగూడలో ముల్లాగా పనిచేస్తున్న అబ్దుల్‌ రెహమాన్‌... ఇటీవలే మల్కారంలో ఇల్లు నిర్మించుకున్నాడు. గృహ ప్రవేశానికి మదర్సాలోని పిల్లలు, తోటి ఉపాధ్యాయుల్ని పిలవగా... ఈ విషాద ఘటన జరిగింది. జవహర్‌నగర్‌ పోలీసులు... స్థానికుల సాయంతో.. చెరువుల్లోంచి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను మదర్సా ఉపాధ్యాయుడు యోహాన్, విద్యార్థులు ఇస్మాయిల్, జాఫర్, సొహైల్, అయాన్, రియాన్‌గా గుర్తించారు. మృతిచెందిన విద్యార్థుల వయస్సు 12 నుంచి 14ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. హెచ్​ఎండీఏ ఇటీవలే ఎర్రగుంటను సుందరీకరించింది. తొలిసారి ఇలాంటి ఘటన జరిగిందని స్థానిక కార్పొరేటర్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...