ముంబై, అక్టోబర్ 21: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత యష్ చోప్రా ఆదివారం సాయంత్రం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన కొద్ది రోజుల నుంచి డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారు. షారుఖ్ ఖాన్ తో తీసిన జబ్ తక్ హై జాన్ ఆయన చివరి చిత్రం. సెప్టెంబర్ 27న యష్ చోప్రా తన 71వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. గతంలో ఆయన 'షోలే- ద మేకింగ్ ఆఫ్ ఎ క్లాసిక్' పుస్తకం జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకొని, పదివేల కాపీలు అమ్ముడయింది. యష్ చోప్రా దర్శకత్వం వహించిన 'దూల్ కా ఫూల్', వక్త్, డాగ్, దీవార్, కభీ కభీ, సిల్ సిలా, చాందిని, డర్, దిల్ తో పాగల్ హై, వీర్ జరా చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి.