Monday, November 28, 2022

యాదాద్రి ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను పరిశీలించిన కె సి ఆర్

హైదరాబాద్ ,నవంబర్ 28: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించారు. తొలుత ప్లాంట్‌ఫేజ్-1లోని యూనిట్-2 బాయిలర్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లిన సీఎం... 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్‌ చేరుకొని నిర్మాణపనులు పరిశీలించారు. ప్లాంట్‌నిర్మాణం జరుగుతున్న తీరుపై ట్రాన్స్‌కో, జెన్‌కో, బీహెచ్‌ఈఎల్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.పవర్ ప్లాంట్‌కు ప్రతిరోజు బొగ్గు, నీరు, ఎంత అవసరమనే విషయంపై చర్చించారు. విద్యుత్‌ కేంద్రంలో పనిచేసే సుమారు 10వేలమంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్‌షిప్ నిర్మాణం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. అక్కడే భవిష్యత్‌లో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ చేపట్టనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారని అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం పవర్ ప్లాంట్‌వరకు 7 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రోడ్డు మంజూరు చేయాలని కార్యదర్శి స్మితాసబర్వాల్‌ను సీఎం ఆదేశించారు. రైల్వేక్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...