Thursday, November 3, 2022

పాత్రికేయ దిగ్గజం వరదాచారి కన్నుమూత


హైదరాబాద్ , నవంబర్ 3; ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు జి.ఎస్ వరదాచారి (92) కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. వరదాచారి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం చదివారు. వివిధ పత్రికల్లో ముఖ్యమైన పదవుల్లో పని చేశారు. నాన్ ముల్కీ సంఘటనలు, ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత జరిగిన చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వరదాచారి.. అనేక వ్యాసాలు రాశారు. తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం విద్యార్థులకు పాఠాలు బోధించారు. జర్నలిజంలో మెలుకువలు నేర్పుతూ ఆయన కొన్ని పుస్తకాలను సైతం రాశారు. ఇలాగేనా రాయడం, దిద్దుబాటు, నార్ల వెంకటేశ్వరరావు, మన పాత్రికేయ వెలుగులు, జ్ఞాపకాల వరద వంటి పుస్తకాలను ఆయన రచించారు. తెలుగు జర్నలిజానికి విశేష సేవ చేసిన వరదాచారి మరణం పట్ల ముఖ్యమంత్రి 

కే సి ఆర్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...