Tuesday, November 29, 2022

రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్​ పోర్ట్​ లైన్​లో 2.5 కిలోమీటర్ల వరకు భూగర్భ మెట్రో

హైదరాబాద్ ,నవంబర్ 29:  హైదరాబాద్ లో త్వరలో చేపట్టబోయే రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్​ పోర్ట్​ లైన్​లో 2.5 కిలోమీటర్ల వరకు భూగర్భ మెట్రో ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించనున్న 31 కిలోమీటర్ల కారిడార్‌కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని.. ఆ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు (31కి.మీ.) మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...