హైదరాబాద్, నవంబర్ 29:
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న ప్రాంతంలో న్యాయమైన విచారణ అసంభవమని వ్యాఖ్యానించింది. భారీ కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసంపై స్వతంత్రంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని సీబీఐకి నిర్దేశిస్తూ.. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ల ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది.2019 మార్చిలో తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై పలు అనుమానాలు ఉన్నాయని, కేసు దర్యాప్తు సజావుగా సాగడం లేదని, దర్యాప్తు సంస్థ విచారణాధికారులపై ప్రైవేట్ కేసులు పెట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారని.. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేక కుమార్తె వైఎస్ సునీత వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
No comments:
Post a Comment