నల్గొండ, నవంబర్ 5:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అతి విశ్వాసానికి , అహంకారానికి భారీ మూల్యమే చెల్లించుకున్నారు. కోరి తెచ్చుకున్న ఉపఎన్నిక కొంప ముంచింది. నా వూరు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఈడ్చి తన్నారు. మునుగోడు ను బంగారు పళ్ళెం లో పెట్టీ టి ఆర్ ఎస్ కు అప్పగించారు. కాంగ్రెస్ కు ఉన్న సీటు కాస్తా ఊడింది. రాజగోపాల్ ను అడ్డం పెట్టుకుని ఉపఎన్నికకు కారణ భూతమై వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పట్టు
సాధించాలని కలలు గన్న బి జె పి కి మునుగోడు పీడ కలనే మిగిలింది. 15 రౌండ్లలో కొనసాగిన ఓట్ల లెక్కింపులో... పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 10,309 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి జయకేతనం ఎగురవేశారు. పోలైన మొత్తం ఓట్లలో తెరాస 95,328 ఓట్లు, భాజపా 85,127 ఓట్లు, కాంగ్రెస్ 23,626 ఓట్లు సాధించాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఏకంగా డిపాజిట్ నే కోల్పోవడం కొసమెరుపు.
No comments:
Post a Comment