న్యూఢిల్లీ, నవంబర్ 3; గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ ఒకటో తేదీన తొలి దఫా, అయిదవ తేదీన రెండో దఫా ఎన్నికలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం 182 స్థానాలకు గాను తొలి విడుతలో 89 స్థానాలకు, రెండవ విడుతలో 93 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2023 ఫిబ్రవరి 18 న ముగియనున్నది.
2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాలు గెలుచుకుంది.
No comments:
Post a Comment