Wednesday, November 30, 2022

ఢిల్లీ మద్యం స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు


హైదరాబాద్, నవంబర్ 30: 

ఢిల్లీ మద్యం స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు ను ఈడీ అధికారులు చేర్చారు. అమిత్​ ఆరోరా రిమాండ్​ రిపోర్టులో కవిత పేరును ఈడీ పేర్కొంది. మంగళవారం రాత్రి అమిత్​ ఆరోరాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అలాగే సౌత్​ గ్రూప్​ సంస్థ వంద కోట్ల రూపాయల ముడుపులను చెల్లించినట్లు తేల్చారు. సౌత్​గ్రూప్​ను శరత్​ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగంట నియంత్రించేవారని ఈడీ వెల్లడించింది. ఈ గ్రూపు ద్వారా రూ. వంద కోట్లను విజయ్​నాయర్​కు చేర్చినట్లు తెలిపారు.ఈడీ చేసిన దర్యాప్తులో అమిత్​ ఆరోరా వాగ్మూలంలో ఈ విషయాన్ని స్పష్టంగా ధృవీకరించినట్లు రిమాండ్​ రిపోర్ట్​లో పేర్కొన్నారు. 36 మంది రూ. 1.38 కోట్లు విలువ చేసే 170 మొబైల్​ ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ ధ్వంసం చేసిన ఫోన్లలో 10 కవిత ఫోన్లు, రెండు నంబర్లు వాడినట్లు ప్రకటించారు. ఆమె వాడిన ఫోన్లు కనిపించకుండా పూర్తిగా ధ్వంసం చేసినట్లు రిమాండ్​ రిపోర్టులో పేర్కొన్నారు.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...