Wednesday, November 2, 2022

బంగ్లా పై గెలుపు: భారత్ సెమీస్ ఛాన్స్ సజీవం


మెల్ బోర్న్ , నవంబర్ 2; టీ20 ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన కీలక పోరు లో టీమ్​ఇండియా ఐదు పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్​ ఆశల్ని సజీవం చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్ శర్మ (2) విఫలం కాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (50) ఫామ్‌ అందిపుచ్చుకొని అర్ధశతకం సాధించాడు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (64*: 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ చివరి వరకు క్రీజ్‌లో ఉండి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆఖర్లో అశ్విన్‌ (13: 6 బంతుల్లో సిక్స్‌, ఫోర్) ధాటిగా ఆడాడు. సూర్యకుమార్‌ (30) రాణించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ 3, షకిబ్ 2 వికెట్లు పడగొట్టారు.అయితే వర్షం కారణంగా భారత జట్టు నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని 151 రన్స్​కు కుదించారు. లిట్టన్​ దాస్​(60:27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) టాప్​ స్కోరర్​గా నిలిచాడు​. టీమ్​ఇండియా బౌలర్లలో అర్షదీప్​, హార్దిక్​ పాండ్య చెరో రెండు వికెట్ల తీయగా.. షమీ ఒక వికెట్​ పడగొట్టారు.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...