హైదరాబాద్ , నవంబర్3; సర్వత్రా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. వృద్ధులు, మహిళలు, యువత ఓటేసేందుకు ఉత్సాహంచూపారు. వికలాంగులు సైతం తమ ఓటహక్కును వినియోగించు కునేందుకు ముందుకొచ్చారు. 47 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చే తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా సిబ్బంది సకాలంలో స్పందించి సరిచేశారు . చివర్లో చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడంతో.. సమయం ముగిసినా వారందరికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఫలితంగా పలు కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది. సుమారు 90శాతానికి పైగా పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment