న్యూఢిల్లీ, నవంబర్ 28: రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే నెలరోజుల్లో కొన్ని పనులు.. 6 నెలల్లో మరికొన్ని పనులు చేయాలన్న హైకోర్టు పరిమితులపై స్టే విధించింది. విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. జనవరి 31లోపు జవాబు తప్పనిసరిగా దాఖలు చేయాలని ఆదేశించింది. రాజధాని అమరావతి అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వంతో పాటు హైకోర్టు తీర్పులో మరికొన్ని అంశాలు చేర్చాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి.. వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సుధీర్ఘ విచారణ జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment