Monday, November 28, 2022

​అమరావతి కి ఊరట: హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ, నవంబర్ 28: రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే నెలరోజుల్లో కొన్ని పనులు.. 6 నెలల్లో మరికొన్ని పనులు చేయాలన్న హైకోర్టు పరిమితులపై స్టే విధించింది. విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. జనవరి 31లోపు జవాబు తప్పనిసరిగా దాఖలు చేయాలని ఆదేశించింది. రాజధాని అమరావతి అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వంతో పాటు హైకోర్టు తీర్పులో మరికొన్ని అంశాలు చేర్చాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి.. వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సుధీర్ఘ విచారణ జరిగింది. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...