కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టో ను విడుదల చేస్తున్న సోనియా, మన్మోహన్, రాహుల్... |
దేశ ప్రజల గొంతుక
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దేశ ప్రజల గొంతుకని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజలతో చర్చించే మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ అవినీతిపై పోరాటం చేస్తుందని, రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు సెక్టార్లలో కూడా రిజర్వేషన్లు అమలు జరిగేలా చట్టం తీసుకు వస్తామని రాహల్ తెలిపారు. గత పదేళ్లలో దేశంలో పేదరిక నిర్మూలన కోసం... జరిగిన కృషిని మరింత వేగవంతం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.
కాంగ్రెస్ మోడల్
సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. దేశాభివృద్ధిలో కాంగ్రెస్ ముందుందని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కొందరు గుజరాత్ మోడల్ అంటున్నారని, కానీ కాంగ్రెస్ విధానం...గుజరాత్ విధానానికి భిన్నమైనదని మన్మోహన్ తెలిపారు. దారిద్య్రరేఖ నుంచి అందరినీ పైకి తీసుకురావడమే కాంగ్రెస్ విధానమని ప్రధాని మన్మోహన్ పేర్కొన్నారు.