Tuesday, September 5, 2023

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

 హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌ తురక చెరువులో మిథున్ మృతదేహం లభ్యం అయింది. మిథున్‌ ఆడుకుంటూ వెళ్లి ఇంటిముందు కాలువలో పడి కొట్టుకు పోయాడు. ప్రగతినగర్‌ చెరువులో డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బాలుడి మృతదేహం వెలికి తీశారు. 

వన్ డే వరల్డ్ కప్ కు భారత జట్టు

ముంబై, సెప్టెంబర్ఐ 5: ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ కు  15 మంది సభ్యుల భారత జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనింగ్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌ను జట్టు లోకి తీసుకున్నారు.  అయితే తిల‌క్ వ‌ర్మ‌, సంజూ సాంస‌న్‌ల‌ను వ‌దిలేశారు. కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీ చేయ‌నున్నాడు. టాప్ ఆర్డ‌ర్‌లో శుభ‌మ‌న్ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్‌, కేఎల్ రాహుల్‌, ర‌వీంద్ర జ‌డేజా ఉన్నారు. బౌల‌ర్ల జాబితాలో శార్దూల్ ఠాకూర్‌, జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్‌, ష‌మీ, అక్ష‌ర్ ప‌టేల్ ఉన్నారు. ఇషాన్ కిష‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌ల‌కు కూడా చోటు క‌ల్పించారు

ఇండియా పేరు ‘భార‌త్‌’ గా మార్పు?

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఇండియా పేరు ను  ‘భార‌త్‌’ గా మార్చేందుకు న‌రేంద్ర మోదీ ప్రభుత్వం పావులు క‌దుపుతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు జ‌రిగే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్రభుత్వం ఈ ప్ర‌తిపాద‌న‌ను తెస్తుందని భావిస్తున్నారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఇండియా పేరును భార‌త్‌గా మార్చే ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతుంద‌ని, ఇండియా పేరు మార్చుతూ స‌భ‌లో తీర్మానం ఆమోదించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నుంచి జి 20 ప్ర‌తినిధుల‌కు డిన్న‌ర్ కోసం పంపిన అధికారిక ఆహ్వాన ప‌త్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని రాసిఉండ‌టం పేరు మార్పు ప్ర‌తిపాద‌న‌కు బ‌లం చేకూరుస్తోంది. 


బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...