హైదరాబాద్, నవంబర్ 30:
వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రగతి భవన్ వద్ద ఆందోళన నిర్వహించినందుకు మంగళవారం మధ్యాహ్నం పోలీసులు షర్మిల పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రాత్రి 9 గంటల సమయంలో నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వ్యక్తిగత పూచీకత్తుపై షర్మిలతో పాటు మరో ఆరుగురికి నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. షర్మిలపై తప్పుడు కేసులు పెట్టారని, శాంతియుత నిరసనకు వెళ్తుంటే అరెస్ట్ చేశారని విచారణ సమయంలో షర్మిల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి అరెస్ట్ చేసిన అందరికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
No comments:
Post a Comment