పెర్త్, మార్చి 6: ప్రపంచ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆల్ రౌండ్ షోతో అదరగొడుతున్న ధోనీసేన వరుసగా నాలుగో విజయం సాధించింది. గ్రూపు-బిలో టాపర్ గా కొనసాగుతున్న భారత్ నాకౌట్ బెర్తు దక్కించుకుంది. తాజాగా వెస్టిండీస్ పై విజయం సాధించింది. పెర్త్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య శుక్రవారం నాడు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్నే విజయం వరించింది. భారత బ్యాట్స్మెన్ తడపడుతూ ఆడినా వెస్టిండీస్ విధించిన 183 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించారు. 4 వికెట్ల తేడాతో 39.1 ఓవర్లలో 185 పరుగులు చేసి వెస్టిండీస్ పై విజయబావుటా ఎగురవేశారు. భారత జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఆపద్బాంధవుడుగా ఉండి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించే కెప్టెన్ ధోనీ, ఈ మ్యాచ్లోనూ అదే ప్రదర్శనను కనబరిచాడు. విండీస్ బౌలర్ల ధాటికి తడబడినా, చమటోడ్చి మరీ 40 పరుగులు చేసి భారత్ గెలుపును ఖాయం చేశాడు. కెప్టెన్గా భారత్కు 59 విజయాలు అందించి మాజీ టీమిండియా కెప్టెన్ గంగూలీ 58 విజయాల రికార్డును కూడా ధోనీ.బ్రేక్ చేశాడు. విండీస్ బ్యాటింగ్ ;ఓ షమి అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టగా, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు, అశ్విన్, శర్మ, జడేజాలు తలో వికెట్ తీసుకున్నారు. ఈ టోర్నమెంటులో ఇప్పటి వరకు ఓటమెరుగని జట్లు రెండే. న్యూజిలాండ్, భారత్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో గెలుపొందాయి. లీగ్ దశలో భారత్ మరో రెండు మ్యాచ్ లు పసికూనలైన ఐర్లాండ్, జింబాబ్వే జట్లతో ఆడాల్సి బున్నందున లీగ్ దశను ఓటమి లేకుండా ముగించే అవకాశముంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment