Sunday, March 29, 2015

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ... ఆరుగురు మృతి

విశాఖపట్నం, మార్చి 29:  ఎస్‌ రాయవరం మండలం గోకులపాడులోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ  పేలుడు సంభవించింది. ఆదివారం నాడు ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు కారణంగా పరిశ్రమలో బారీగా మంటలు ఎగసి  పడ్దాయి  అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. పరిశ్రమలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహయక చర్యలు చేపట్టారు. ఆదివారం కావడంతో చిన్న పిల్లలు కూడా పనిలోకి వచ్చారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. 



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...