Friday, March 13, 2015

క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ ప్రత్యర్థి బంగ్లా ...

మెల్బోర్న్, మార్చి13;  ప్రపంచకప్‌ క్రికెట్ -2015 తొలి అంకం ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో క్వార్టర్‌ ఫైనల్‌లో తలపడే జట్లు దాదాపు ఖరారు అయ్యాయి.  ఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం.. పూల్‌-ఎలో నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో పూల్‌-బిలో అగ్రస్థానంలో ఉన్న జట్టు తలపడాల్సి ఉంది. తాజా గణంకాల ప్రకారం భారత్‌ 10 పాయింట్లతో పూల్‌-బిలో అగ్రస్థానంలో ఉండగా, పూల్‌-ఎలో 7 పాయింట్లతో బంగ్లాదేశ్‌ నాలుగో స్థానంలో ఉంది. కాబట్టి క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ X బంగ్లాదేశ్‌ పోరు ఖరారైనట్లే. తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ మ్యాచ్‌ ఈనెల 21న వెల్లింగ్టన్‌లో జరగాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్లో ఐసీసీ మార్పులు చేసింది. మ్యాచ్‌ను కొద్దిగా ముందుకు జరిపి మార్చి 19న మెల్‌బోర్న్‌ వేదికగా నిర్వహించనుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...