నెల్లూరు, మార్చి 7 : విభజన హామీలు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేది లేదని కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని గత ప్రభుత్వం విభజన చట్టంలో పొందుపర్చకపోవడం వల్లే ఇప్పుడు సమస్య వస్తోందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయం కేంద్ర మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని వెంకయ్య అన్నారు.
గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే పోలవరం పనులు ఇంతకాలం ముందుకు సాగలేదని విమర్శించారు. పోలవరం అథారిటీ నివేదిక తర్వాత నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని వెంకయ్య చెప్పారు. ఏపీ రాజధానికి పట్టణాభివృద్ధి శాఖ నుంచి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని వెంకయ్య వెల్లడించారు.
విభజన బిల్లులో పేర్కొన్న అన్ని అంశాలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వాటిని అంశాల వారీగా పరిష్కరిస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.
No comments:
Post a Comment