Friday, March 6, 2015

బాబు ను ఇబ్బంది పెట్టను...పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌, మార్చి 6 : టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం తన అభిమతం కాదని జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, బాధ్యతను గుర్తుచేసేందుకు యత్నిస్తున్నామని చెప్పారు.  పాలకుల విధానాల్లో లోపం ఉంటే ఆ ప్రభావం రాబోయే తరాలపై పడుతుందని పవన్‌ పేర్కొన్నారు. రెండు ప్రాంతాలకు నష్టం జరిగిందని మోదీకి చెప్పానని పవన్‌ వివరించారు. అభివృద్ధి మాటున గ్రామాలను నాశనం చేయొద్దని సూచించారు. గ్రామాలు ఉండాలి, గ్రామాభివృద్ధి జరగాలని పవన్‌ అభిప్రాయపడ్డారు. 10 శాతం రైతులకు భూమివ్వడం ఇష్టంలేదని మంత్రులు, ఎమ్మెల్యేలే తనకు చెప్పారని ఆయన తెలిపారు. రెండు రాష్ర్టాల్లో పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. ఏపీ రాజధాని సింగపూర్‌ దేశం కంటే పెద్దదన్న పవన్... సింగపూర్‌కు మించిన రాజధాని కట్టాలనుకోవడం సంతోషకరమన్నారు. సింగపూర్‌ నిర్మించేందుకు 20 ఏళ్లు పట్టిందని, ఏపీ రాజధాని నిర్మాణానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని పవన్‌ వెల్లడించారు.  ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. పార్లమెంటులో ఎందుకు మాట ఇచ్చారన్నారు. మాట తప్పితే ఏపీలో బీజేపీని ఎలా నమ్ముతారని పవన్‌ ప్రశ్నించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...