Thursday, March 12, 2015

తెలంగాణాలో చెరువుల పండుగ ....

నిజామాబాద్,,మార్చి 12 : తెలంగాణాలో  చెరువుల పండుగ పారంభమయింది. రాష్ట్ర చిన్న నీటిపారుదల రంగంలో విప్లవాత్మక మార్పులకు మైలురాయిగా నిలువనున్న మిషన్ కాకతీయ ఉద్యమానికి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ లో ముఖ్యమంత్రి చ్సనంద్రశేఖర రావు శ్రీకారం చుట్టారు. పార పట్టి మట్టిని తీసి.. ఆ మట్టిని తట్టతో మోసి ట్రాక్టర్‌లో వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.   మన చెరువులను పునరుద్ధరించుకొనే ఈ మిషన్ కాకతీయ కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగాలని, స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సైతం ప్రజలతో మమేకమై రాత్రిపగలు కష్టపడాలని సీఎం పిలుపునిచ్చారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ,  రాష్ట్రంలో మొత్తం 46,447 చెరువులు ఉన్నాయని,  ఈ ఏడు 9,573 చెరువులను పునురద్ధరణకు తీసుకున్నామని  ప్రతీ సంవత్సరం 20 శాతం చొప్పున చెరువుల పునరుద్ధరణ చేసుకుంటూ వెడతామని  చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...