Sunday, March 29, 2015

పట్టిసీమ తెస్తాం ...పోలవరం సాధిస్తాం

ఏలూరు, మార్చి 29 : పోలవరం ప్రాజెక్టు మన కల అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరానికి ఎంత ఖర్చయినా ఇస్తామని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పినట్టు తెలిపారు. ఇక్కడి రైతులకు ఇచ్చిన తర్వాతనే పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీటిని తరలిస్తామని వివరించారు. గోదావరిలో మూడువేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పేర్కొన్నారు. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే రాష్ట్రంలో నీటికి కరువు ఉండనే ఉండదని బాబు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం  చంద్ర బాబు అక్కడినుంచి పోలవరం వెళ్లారు. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...