హైదరాబాద్ ,మార్చి 28; పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి27(పీఎస్ఎల్వీ) శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 'షార్' నుంచి శనివారం సాయంత్రం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహకనౌక ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.దీని బరువు 1,425 కిలోలు. ఇందులో ఇంధనం 821.5 కిలోలు కాగా ఉపగ్రహం బరువు 603.5 కిలోలు. దీని తయారీకి రూ.125 కోట్లు ఖర్చు చేశారు.నావిగేషన్ అభివృద్ధికిగాను మొత్తం ఏడు ఐఆర్ఎస్ఎస్ఎస్ ఉపగ్రహాలను నింగిలోకి పంపాల్సిఉండగా.. ప్రస్తుతం పంపించింది నాలుగోది. మిగిలిన ఉపగ్రహాలను ఈ ఏడాదిలోనే పంపెందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. నావిగేషన్ వ్యవస్థతో విపత్తుల అంచనా, నౌకలు, ఇతర వాహనాల రాకపోకలు గుర్తించే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది .
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment