ఖమ్మం,మార్చి 28: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భద్రాద్రిలో తొలి శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మిధిలా ప్రాంగణం లో అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భద్రాచలం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాచలాన్ని గొప్ప ఆద్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. తెలంగాణలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ తెలియజేశారు.
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్
ఖమ్మం జిల్లాలోని పినపాకలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యమని, మూడేళ్లలో థర్మల్ పవర్ స్టేషన్ను పూర్తి చేస్తామని చెప్పారు. దీని ద్వారా తెలంగాణలో మిగులు విద్యుత్ సాధిస్తామని సీఎం తెలిపారు.
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్
ఖమ్మం జిల్లాలోని పినపాకలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యమని, మూడేళ్లలో థర్మల్ పవర్ స్టేషన్ను పూర్తి చేస్తామని చెప్పారు. దీని ద్వారా తెలంగాణలో మిగులు విద్యుత్ సాధిస్తామని సీఎం తెలిపారు.
No comments:
Post a Comment