Saturday, March 28, 2015

కళ్యాణోత్సవంతో పులకించిన ఒంటిమిట్ట,రామతీర్థం...

కడప, మార్చి 28 : శ్రీరామనవమి సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాస్వామికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఒంటిమిట్టలో ధ్వజారోహణం వైభవంగా సాగింది. రాములవారి కళ్యాణోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
రామతీర్థంలో
విజయనగరం జిల్లా  రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఆనంద గజపతిరాజు దంపతులు సమర్పించారు. రాష్ట్రమంత్రి మృణాళిని దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించారు.  మంత్రి మాణిక్యాలరావు కూడా  రాములవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను మంత్రి మాణిక్యాలరావు సమర్పించారు. రామతీర్థం అభివృద్ధికి రూ. 1.7 కోట్లను కేటాయిస్తున్నట్లు  మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...