హైదరాబాద్, మార్చి 8 : మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి , ఆమె కుమారుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరిరువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. సీమాంధ్రుల మనోభావాలను కాంగ్రెస్ పట్టించుకోలేదని, ఈ పరిణామాల వల్ల సీమాంధ్రలో ఇక కాంగ్రెస్ లేనట్టేనని గల్లా అరుణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు అతలాకుతలంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మళ్లీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లగలగిన నాయకుని కోసం ఎదురు చూస్తున్నారని, అటువంటి నాయకత్వాన్ని ఒక్క చంద్రబాబు మాత్రమే అందించగలరన్న విశ్వాసంతో తెలుగుదేశంలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment