Saturday, March 8, 2014

కొడుకుతో పాటు టి.డి.పి. లో చేరిన గల్లా అరుణ...

హైదరాబాద్, మార్చి 8 : మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి , ఆమె కుమారుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త  గల్లా జయదేవ్ టీడీపీలో చేరారు.  ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరిరువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. సీమాంధ్రుల మనోభావాలను కాంగ్రెస్ పట్టించుకోలేదని,  ఈ పరిణామాల వల్ల సీమాంధ్రలో ఇక కాంగ్రెస్ లేనట్టేనని గల్లా అరుణ  అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు అతలాకుతలంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మళ్లీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లగలగిన నాయకుని కోసం ఎదురు చూస్తున్నారని, అటువంటి నాయకత్వాన్ని  ఒక్క చంద్రబాబు మాత్రమే అందించగలరన్న విశ్వాసంతో తెలుగుదేశంలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...