Saturday, March 8, 2014

సీమాంధ్రకు న్యాయం కోసమే బీజేపీలో చేరా....పురందేశ్వరి

హైదరాబాద్, మార్చి 8 : స్వప్రయోజనాల కోసం తాను బీజేపీలో చేరలేదని దగ్గుబాటి  పురందేశ్వరి స్పష్టం చేశారు. తనకు  కృతజ్ఞత లేదంటూ  జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. తెలంగాణ బిల్లు విషయంలో తమ వాదనలను కాంగ్రెస్ పెడచెవిన పెట్టిందన్న ఆవేదనతో పార్టీని వీడానన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ బీజేపీలో చేరినట్లు పురందేశ్వరి చెప్పారు. లోక్‌సభలో తాము అడిగినప్పుడే  ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్  స్పెషల్ ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు.  బీజేపీ ఒత్తిడి మేరకే సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారన్నారు. సీమాంధ్రకు జరగాల్సిన న్యాయం కోసమే తాను  బీజేపీలో చేరినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనను గౌరవించిందనడంలో సందేహం లేదమి, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట బజారుకీడ్చే పనులు తాను చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను గౌరవించిందనడంలో సందేహం లేద న్నారు. రామాయపట్నం దగ్గర తనకు వెయ్యి ఎకరాలు ఉన్న మాట అవాస్తవమని పురందేశ్వరి తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...