అహ్మదాబాద్, మార్చి 21 : దేశానికి నరేంద్రమోదీ లాంటి నాయకత్వం అవసరమని 'జనసేన' అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మోదీకి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అహ్మదాబాద్లోని గాంధీనగర్లో బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మోదీ- పవన్ సమావేశమయ్యారు. సుమారు 40 నిముషాల పాటు వారి మధ్య చర్చలు జరిగాయి, అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్లాల్లోని సమస్యలను మోదీకి వివరించానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు లేకుండా రాష్ట్రాన్ని విభజించిందని ఆయన అన్నారు. అదే మోదీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని పవన్ అభిప్రాయపడ్డారు. మోదీ ప్రధాని అయితే రాష్ట్రానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో కూడా చెప్పానని ఆయన అన్నారు. తాను పదవుల కోసం రాజకీయంలోకి రాలేదని, పదవులపై వ్యామోహం లేదని పవన్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పవన్ తెలిపారు. మోదీకి మద్దతు తెలపడం కోసమే అహ్మదాబాద్ వచ్చానని ఆయన అన్నారు. మోదీని ప్రధానిని చేయడానికి నేను, నా పార్టీ కృషి చేస్తామని పవన్ స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment