Saturday, March 8, 2014

239 మందితో సముద్రంలో కూలిన మలేసియా విమానం

 మృతులలో ఐదుగురు ఇండియన్లు...
కౌలాలంపూర్, మార్చి 8 : మలేషియా నుంచి బీజింగ్ వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శనివారం తెల్లవారుజామున సముద్రంలో కూలిపోయింది. వియాత్నంలో ఈ విమానం కుప్పకూలినట్లు అధికారులు ధృవీకరించారు. విమానంలో 227 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.   శుక్రవారం అర్థరాత్రి 12:41 గంటలకు కౌలాలంపూర్ నుంచి బయలుదేరిన విమానంతో రెండు గంటల తర్వాత సంబంధాలు తెగిపోయాయి. ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు, 152 మంది చైనీయులు, 30 మంది మలేషియన్లతో పాటు ఇండోనేషియన్లు, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యూఎస్, న్యూజిల్యాండ్, ఉక్రేనియన్, కెనడా, రష్యా, ఇటలి, నెదర్లాండ్, తైవాన్, ఆస్ట్రియా దేశస్థులు ఉన్నారు. మలేషియా ఎయిర్‌లైన్ సిబ్బంది, సహాయక బృందాలు  గాలింపు చర్యలు చేపట్టాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...