హైదరాబాద్,మార్చి 25: నరేంద్ర మోడీ పట్ల, ఆయన ప్రధాని అభ్యర్థిగా ఉన్న బీజేపీ పట్ల టాలీవుడ్ ప్రముఖుల్లో ఆసక్తి పెరుగుతోంది. మొన్న పవన్ కల్యాణ్... నిన్న నాగార్జున ఇలా టాలీవుడ్లో 'న.మో.' జపం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు మరో హీరో మోహన్ బాబు కూడా మోడీ తో సమావేశం కానున్నస్ట్టు సమాచారం. మోదడీ గత ఏడాది హైదరాబాద్కు వచ్చినప్పుడు మోహన్బాబు తన కుమార్తె లక్ష్మీప్రసన్న, కుమారుడు విష్ణుతో పాటు ఆయనను కలిశారు. ఇటీవల తిరుపతిలో మోహన్బాబు మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాలకు సంబంధించి త్వరలో సంచలన ప్రకటన చేస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. నిజానికి సినీ పరిశ్రమలో ఎక్కువమంది తెలుగుదేశం వైపో, కాంగ్రెస్వైపో ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 'చిత్రం' మారిపోయింది. ఇక తెలుగుదేశానికి కొందరు సినీ ప్రముఖుల మద్దతు కొనసాగుతున్నా, ఇప్పుడు కొత్తగా 'మోదీడీ హవా' మొదలైంది. 'తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదడీ నాయకత్వం అవసరం' అని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇప్పుడు... మోదీని కలిసి వచ్చిన అనంతరం అక్కినేని నాగార్జున కూడా అదే మాట చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో... సీమాంధ్రలోనూ బీజేపీ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. రెబల్స్టార్ కృష్ణంరాజు గతంలో బీజేపీ టికెట్తో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పార్టీకి దూరమైన ఆయన... తిరిగి అదే గూటికి చేరారు. నటి జీవిత ఈ మధ్యే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాగార్జున ఇప్పటికే వెంకయ్యనాయుడుని కలిసి, తన సతీమణి అమలకు విజయవాడ పార్లమెంట్ సీటును ఇప్పించాల్సిందిగా కోరారనీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
అందులో భాగంగానే మోడీని కలిసినట్లు తెలుస్తోంది. కాగా యువ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా లు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసే అవకాశాలు లేకపోలేదంటూ వస్తున్న వార్తలు కొసమెరుపు...
అందులో భాగంగానే మోడీని కలిసినట్లు తెలుస్తోంది. కాగా యువ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా లు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసే అవకాశాలు లేకపోలేదంటూ వస్తున్న వార్తలు కొసమెరుపు...
No comments:
Post a Comment