న్యూఢిల్లీ, మార్చి 5 : 2014 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్ బుధవారం ప్రకటించారు. మే 16న దేశవ్యాప్తంగా ఒకే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 81.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మొదటిసారిగా తిరస్కరణ ఓటు (నోటా)ను ప్రవేశపెట్టారు. షెడ్యూల్ విడుదల తో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 30న, మే 7న పోలింగ్ జరుగనుంది. తొలి పోలింగ్ .. ఏప్రిల్ 7వ తేదీ. ఆరోజు ఆరు , తదుపరి 9వ తేదీన ఐదు రాష్ట్రాల్లో 7 పార్లమెంటరీ నియోజవకర్గాల్లోను, 10వ తేదీన 14 రాష్ట్రాల్లో 92 నియోజకవర్గాల్లోను, 12వ తేదీన మూడు రాష్ట్రాల్లోని 5 నియోజకవర్గాల్లో ను , 17వ తేదీన 13 రాష్ట్రాల్లో 122 నియోజకవర్గాల్లో ను పోలింగ్ ఉంటుంది. ఏప్రిల్ 24న ఆరో దశలో 12 రాష్ట్రాల్లోని 117 లోక్సభ స్థానాలకు, * ఏప్రిల్ 30న ఏడో దశలో 9 రాష్ట్రాల్లోని 89 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మే 7న ఎనిమిదవ దశలో 7 రాష్ట్రాల్లోని 64లోక్సభ స్థానాలకు, మే 12న తొమ్మిదవ దశలో 3 రాష్ట్రాల్లోని 41 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు, ,
ఏప్రిల్ 30న తెలంగాణలో, మే 7 సీమాంధ్రలో
ఆంధ్రప్రదేశ్లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి.ఏప్రిల్ 30న తెలంగాణలో, మే 7 సీమాంధ్రలో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, 119 అసెంబ్లీ స్థానాలకు, సీమాంధ్రలో 25 లోక్సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
తెలంగాణలో :* ఏప్రిల్ 2న తెలంగాణలో నోటిఫికేషన్ విడుదల * ఏప్రిల్ 9న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
* ఏప్రిల్ 10న నామినేషన్ల పరిశీలన* ఏప్రిల్ 12న నామినేషన్ల ఉపసంహరణ* ఏప్రిల్ 30 తెలంగాణలో ఎన్నికలు
సీమాంధ్రలో :* ఏప్రిల్ 12న సీమాంధ్రలో నోటిఫికేషన్ విడుదల* ఏప్రిల్ 19న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
* ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన* ఏప్రిల్ 23న నామినేషన్ల ఉపసంహరణ* మే 7న సీమాంధ్రలో ఎన్నికలు.
No comments:
Post a Comment