Saturday, March 1, 2014

41 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మరోమారు రాష్ట్రపతి పాలన

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది రెండోసారి. ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కలిపితే... ఇది మూడోసారి అవుతుంది. మూడుసార్లూ ఇది  'రాష్ట్ర విభజన - ఆవిర్భావం'తో ముడిపడటం ఒక విశేషం. మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర  రాష్ట్రం ఏర్పడిన ఏడాదికి రాష్ట్రపతి పాలన విధించారు. తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పై అప్పట్లో అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ను పదవినుంచి దించేశారు. ప్రత్యామ్నాయమేదీ లేకపోవడంతో... 1954 నవంబర్ 15న ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించారు. ఇది... 1955 మార్చి 29 వరకు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన చాలా కాలానికి జై ఆంధ్రా ఉద్యమం నేపథ్యంలో 1973లో అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అప్పట్లో చెలరేగుతున్న అల్లర్లను అదుపు చేయడానికి వీలుగా 1973లో జనవరి 11 నుంచి డిసెంబర్ 10 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. మళ్లీ... 41 ఏళ్ల తర్వాత రాష్ట్రం మరోమారు రాష్ట్రపతి పాలనలోకి వెళుతోంది. ఇప్పుడు రాష్ట్రవిభజనపై నిర్ణయం.. సీఎం రాజీనామా చేయడం.. మరో ముఖ్య మంత్రిని నియమించలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించడం గమనార్హం.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...