వాషింగ్టన్, మార్చి 5 : యాసిడ్ దాడి బాధితురాలు, ఢిల్లీకి చెందిన లక్ష్మీకి అంతర్జాతీయ పురస్కారం లభించింది. బుధవారం అమెరికాలోని వాషింగ్టన్లో ప్రతిష్టాత్మక 'అంతర్జాతీయ ఉమెన్ ఆఫ్ కరేజ్' అవార్డును లక్ష్మీ స్వీకరించారు. అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ఈ పురస్కారాన్ని లక్ష్మీకి అందజేశారు. 2005లో యాసిడ్ ఘటన చోటుచేసుకుంది. అప్పుడు లక్ష్మీకి 16 ఏళ్ల వయసు. లక్ష్మీ తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఆమె స్నేహితురాలి సోదరుడే లక్ష్మీపై యాసిడ్ దాడి చేశాడు. అయితే లక్ష్మీ మానసికంగా కృంగిపోలేదు. ఆమె చేసిన పోరాటం ఫలితంగానే మన దేశంలో యాసిడ్ అమ్మకాలను నియంత్రిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లక్ష్మీ ధైర్యానికి గుర్తింపుగా అంతర్జాతీయ ఉమెన్ ఆఫ్ కరేజ్ పురస్కారాన్ని ఆమెకు ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment