Wednesday, March 26, 2014

అర ' చేతిలో ' వైకుంఠం ....

కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టో ను విడుదల చేస్తున్న సోనియా, మన్మోహన్, రాహుల్...
న్యూఢిల్లీ,మార్చి 26:  సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ను వీడుదల చేసింది. మేనిఫెస్టో రూపకల్పనలో కొత్త పద్ధతులు అవలంభించామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. దేశంలోని పేదల శ్రేయస్సు, సంక్షేమమే లే లక్ష్యంగా  ఎన్నికల మేనిఫెస్టో రూపొందించామని ఆమె తెలిపారు.  ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటించారని, వివిధ వర్గాల ప్రజలతో చర్చలు జరిపి, వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారని, వాటికి  అనుగుణం గానే  మేనిఫెస్టో రూపొందించినట్లు సోనియా తెలిపారు.  ప్రజలందరికీ ఆరోగ్య హక్కు కల్పిస్తామని ,  ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టిస్తామని ,దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి హామీ కల్పిస్తామని సోనియా పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళిక తయారీకి చాలా కసరత్తు చేశామని, 2014 ఎన్నికలు కేవలం అభివృద్ధి కోసమే కాదని సోనియా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరిన్ని బాధ్యతలు ఉన్నాయని, రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని ఆమె అన్నారు. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని, లౌకిక భారతం కోసం పోరాడుతామని సోనియాగాంధీ పేర్కొన్నారు. రైతులు, వివాహిత మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతుమని.
దేశ ప్రజల గొంతుక
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దేశ ప్రజల గొంతుకని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజలతో చర్చించే మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు ఆయన తెలిపారు.  తమ పార్టీ అవినీతిపై పోరాటం చేస్తుందని, రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు సెక్టార్లలో కూడా రిజర్వేషన్లు అమలు జరిగేలా చట్టం తీసుకు వస్తామని రాహల్ తెలిపారు.  గత పదేళ్లలో దేశంలో పేదరిక నిర్మూలన కోసం... జరిగిన కృషిని మరింత వేగవంతం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.
కాంగ్రెస్  మోడల్
సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు.  దేశాభివృద్ధిలో కాంగ్రెస్ ముందుందని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కొందరు గుజరాత్ మోడల్ అంటున్నారని, కానీ కాంగ్రెస్ విధానం...గుజరాత్ విధానానికి భిన్నమైనదని మన్మోహన్ తెలిపారు. దారిద్య్రరేఖ నుంచి అందరినీ పైకి తీసుకురావడమే కాంగ్రెస్ విధానమని ప్రధాని మన్మోహన్ పేర్కొన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...