హైదరాబాద్, మార్చి 13: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సొంత పార్టీ ఏర్పాటు మెగా స్టార్ చిరంజీవి కి సంకటంగా మారింది. మరో 24 గంటలలో పార్టీ ని అధికారికంగా పవన్ ప్రకటించనున్న తరుణంలో చిరంజీవి రాష్ట్ర వ్యాప్తంగా గల తమ అభిమాన సంఘాల నాయకులతో ఢిల్లీనుంచి టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడినట్టు తెలుస్తున్నది. పవన్ కళ్యాన్ సమావేశానికి వెళ్లరాద ని చిరు తన అభిమానులను ఆదేశించినట్టు, కొంతమంది చిరు అభిమానులు దానిని ధిక్కరించినట్టు సమాచారం. అనేక మంది అభిమానులు పవన్ను ఒంటరి చేయడం సరికాదని, తాము పవన్ సమావేశానికి వెళ్లితీరతామని చిరుకు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. చిరును నమ్ముకుని ప్రజారాజ్యం వెంట నడిస్తే చివరికి చిరు కాంగ్రెస్లో విలీనం కావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు కొంతమంది ముక్కు సూటిగా వెళ్లే పవర్ స్టార్ వెంట నడిస్తేనే మంచిదని భావిస్తున్నామని చిరుకు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. కాగా, చిరంజీవి కుమారుడు రాం చరణ్ తేజ్ , చిరంజీవి సోదరుడు నాగబాబు చిరంజీవి వెంటే ఉంటామని స్పష్టం చేయడంతో పవన్ ఒంటరి అయినట్టు కనబడుతోంది. అయితే పవన్ ప్రస్తుతం కుటుంబ వ్యవహారం పై ఏమీ స్పందించడం లేదు. తన జనసేన పార్టీ పేరును ఆయన శుక్రవారం నాడు అధికారికంగా ప్రకటించనున్నారు. పవన్ పార్టీ గుర్తు షట్చక్రం కాగా, నినాదం ఫైట్ ఫర్ ది రైట్స్ అని తెలుస్తోంది.
పవన్ ' షట్చక్ర ' బంధంలో చిరు...
పవన్ ' షట్చక్ర ' బంధంలో చిరు...
No comments:
Post a Comment