Tuesday, November 2, 2010
మణిపూర్ సైనిక చట్టంపై పదేళ్ళుగా ఓమహిళ నిరాహార పోరు
ఇంఫాల్,నవంబర్ 2: మణిపూర్లో వివాదస్పద 1958 నాటి సైనికదళాల ప్రత్యేక చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈరమ్ షర్మిలా చాను నిరాహార దీక్ష చేపట్టి పదేళ్లు పూర్తయ్యాయి. రైఫిల్స్ దళానికి చెందిన జవానులు ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో 10 మంది పౌరులను పొట్టనపెట్టుకోవడంతో ఆమె నిరాహారదీక్షకు దిగారు. ప్రసుత్తం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు జేఎన్ ఆస్పత్రిలో ముక్కు ద్వారా ద్రవాహారాన్ని ఎక్కిస్తున్నారు. షర్మిలా దీక్ష చేపట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పలు సామాజిక సంఘాలు మణిపూర్లో పలుచోట్ల బైఠాయింపులు జరిపాయి. విప్లవమూర్తికి సంఘీభావంగా రిక్షావాలాలు ర్యాలీలు నిర్వహించారు. శాంతియుత సమరాన్నే శ్వాసగా చేసుకుని కర్కశ సైనిక చట్టంపై పోరాటం చేస్తున్న ధీశాలి ఈరమ్ షర్మిలా చాను పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
-
హైదరాబాద్, జనవరి 22: మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరిలేరు. మంగళవారం తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో ఆయన హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుద...
No comments:
Post a Comment