Tuesday, November 2, 2010
తగ్గనున్న వర్షాలు...
హైదరాబాద్,నవంబర్ 2:మంగళవారం కూడా కోస్తాంధ్రలో కుంభవృష్టి కురిసింది. అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. వరి, పత్తి, మినుము, మిరప, కంది పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే వరి నష్టం రూ. 350 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.మరోవైపు అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు కాస్త బలహీనపడ్డాయి. దీంతో వర్షాలు ఒకట్రెండు రోజుల్లో కాస్త తగ్గుముఖం పట్టనున్నాయి. రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని భారత వాతావరణ విభాగం తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
-
హైదరాబాద్, జనవరి 22: మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరిలేరు. మంగళవారం తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో ఆయన హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుద...
No comments:
Post a Comment