Tuesday, November 2, 2010
ఏఐసీసీ సమావేశం లో మన్మోహన్ డూప్...
న్యూఢిల్లీ,నవంబర్ 2: ఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో ఏఐసీసీ సమావేశం జరుగుతోంది. తెల్లని కుర్తా పైజమా, లేత నీలిరంగు తలపాగా ధరించి తెల్లని గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి లోనికి వచ్చాడు. అందరూ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వస్తున్నారంటూ గౌరవంగా దారి చ్చారు. కానీ అప్పటికే మన్మోహన్సింగ్ వేదికపై వున్నారు. అచ్చం మన్మోహన్లా వున్న ఆ వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఒక్కసారి ఆయనను ఆశ్చర్యంగా చూశారు.అంతేకాదు..తన పక్కనే వున్న మన్మోహన్ కు కూడా చూపించారు. అచ్చం మన్మోహన్లా ఉన్న ఆ వ్యక్తి పేరు గుర్మీత్సింగ్ సేథీ. ఆయన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఏఐసీసీ సభ్యుడు. ప్రధాని ట్రేడ్ మార్క్ దుస్తుల్లో వచ్చిన సేథీ ఇలా కాసేపు ఆడియన్స్ లో సందడి చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
-
హైదరాబాద్, జనవరి 22: మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరిలేరు. మంగళవారం తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో ఆయన హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుద...
No comments:
Post a Comment