Tuesday, November 2, 2010

ఏఐసీసీ సమావేశం లో మన్మోహన్ డూప్...

Pic1
న్యూఢిల్లీ,నవంబర్ 2: ఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో ఏఐసీసీ సమావేశం జరుగుతోంది. తెల్లని కుర్తా పైజమా, లేత నీలిరంగు తలపాగా ధరించి తెల్లని గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి లోనికి వచ్చాడు. అందరూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వస్తున్నారంటూ గౌరవంగా దారి చ్చారు. కానీ అప్పటికే మన్మోహన్‌సింగ్ వేదికపై వున్నారు. అచ్చం మన్మోహన్లా వున్న ఆ వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఒక్కసారి ఆయనను ఆశ్చర్యంగా చూశారు.అంతేకాదు..తన పక్కనే వున్న మన్మోహన్ కు కూడా చూపించారు. అచ్చం మన్మోహన్‌లా ఉన్న ఆ వ్యక్తి పేరు గుర్మీత్‌సింగ్ సేథీ. ఆయన ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఏఐసీసీ సభ్యుడు. ప్రధాని ట్రేడ్ మార్క్ దుస్తుల్లో వచ్చిన సేథీ ఇలా కాసేపు ఆడియన్స్ లో సందడి చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...