Monday, November 1, 2010
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరితే అదనపు బలగాలను పంపుతాం: చిదంబరం
న్యూఢిల్లీ,నవంబర్ 1 : శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించేందుకు ఇంకా డిసెంబర్ 31 వరకు గడువుందని, ప్రస్తుతం తనకు అప్పగించిన బాధ్యతను కమిటీ నిర్వర్తిస్తోందని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నెలవారీ పనితీరుపై అక్టోబరు మాసపు నివేదికను సోమవారం ప్రకటించిన సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించేందుకు ఇంకా గడువుందని గుర్తుచేశారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు బలగాలను అభ్యర్థిస్తే పంపే విషయాన్ని పరిశీలిస్తామని అన్నారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞాపన రాలేదని.. అవసరమైన పక్షంలో తాము స్పందిస్తామని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
-
హైదరాబాద్, జనవరి 22: మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరిలేరు. మంగళవారం తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో ఆయన హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుద...
No comments:
Post a Comment