Monday, November 1, 2010

అరుంధతి రాయ్ పై దేశద్రోహం కేసు

న్యూఢిల్లీ,నవంబర్ 1: కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రచయిత్రి అరుంధతి రాయ్, వేర్పాటువాద సంస్థ హురియత్ నేత సయ్యద్ అలీ షా గిలానీలపై ఇక్కడి ఓ కోర్టులో దేశద్రోహం కేసు నమోదు అయింది. వీరిద్దరితోపాటు ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్, పార్లమెంటుపై దాడి కేసులో నిర్దోషిగా విడుదలైన ఎస్‌ఏఆర్ గిలానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ వర్సిటీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుసేన్‌లతో సహా మరో ఐదుగురు భారత వ్యతిరేక ప్రకటనలు చేశారని, ఈ మేరకు దేశ ద్రోహం నేరం కింద వారిని విచారించాలంటూ ఆదిత్య రాజ్ కౌల్ అనే వ్యక్తి ఫిర్యాదు నమోదుచేశారు. ఈ ఫిర్యాదు నవంబరు 3న  విచారణకు రానుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...