Monday, November 1, 2010

ఏఐసీసీ కీలక సమావేశానికి ఏర్పాట్లు పూర్తి

న్యూఢిల్లీ,నవంబర్ 1: తల్కతోరా స్టేడియంలో ఏఐసీసీ కీలక సమావేశం మంగళవారం జరగనుంది. సోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలిగా వరుసగా నాలుగోసారి ఎన్నికైన తర్వాత జరుగుతున్న సమావేశం ఇది. ఈ సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులను ఎన్నుకుంటారు. రాష్ర్టం నుంచి ఈ సమావేశానికి 141 మంది ఆహ్వానాలు అందగా 131 మంది హాజరైయ్యే అవకాశం ఉందని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు. కాగా, ఏఐసీసీ సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రోశయ్య సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. తన పర్యటనలో ప్రభుత్వ పరమైన కార్యక్రమాలేవీ వుండబోవని ఆయన స్పష్టం చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...