Monday, November 1, 2010

ఫిబ్రవరిలో చిరంజీవి 150వ చిత్రం షూటింగ్

హైదరాబాద్,నవంబర్ 1: : తన 150వ  చిత్రం షూటింగ్ 2011 ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుందని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.  ఇకపై 20 రోజులు రాజకీయాలకు, పది రోజులు సినిమాకి కేటాయిస్తాని ఆయన చెప్పారు.  అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత స్వయంగా తాను హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రాజకీయాలకు చోటుండదని స్పష్టం చేశారు. ప్రజలు తమ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలపైనే కథ ఉంటుందని, మానవ సంబంధాలే కీలకంగా కథాంశం నడుస్తుందని వివరించారు. ఠాగూర్ సినిమాలో అవినీతి అన్న ఒక అంశమే కథగా ఉంటే.. ఈ చిత్రంలో సమాజంలో అన్ని ప్రధాన సమస్యల ప్రస్తావన ఉంటుందన్నారు. చిత్ర నిర్మాణం విదేశాల్లో కాకుండా మన ప్రాంతంలోనే ఉండేలా ప్రణాళిక తయారు చేసుకుంటున్నట్టు చెప్పారు. సినిమా దర్శకుడెవరన్నది ఖరారు కాలేదన్నారు. రాంగోపాల్‌వర్మ దర్శకునిగా ‘దొర’ పేరు ఖరారు అయిందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను సినిమా షూటింగ్‌లో పాల్గొనే సమయంలో పార్టీ బాధ్యతలు ఎవ్వరికీ అప్పగించబోనని స్పష్టంచేశారు. పార్టీ బాధ్యతలు నిర్వహించడానికి ఉదయమో.. సాయంత్రమో వీలుకలిగేలా షూటింగ్‌లో పాల్గొంటానన్నారు. అవసరమైతే షూటింగ్ ప్రదేశం నుంచే పార్టీ కార్యకలాపాలు చూసుకుంటామని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...