Tuesday, September 5, 2023

వన్ డే వరల్డ్ కప్ కు భారత జట్టు

ముంబై, సెప్టెంబర్ఐ 5: ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ కు  15 మంది సభ్యుల భారత జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనింగ్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌ను జట్టు లోకి తీసుకున్నారు.  అయితే తిల‌క్ వ‌ర్మ‌, సంజూ సాంస‌న్‌ల‌ను వ‌దిలేశారు. కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీ చేయ‌నున్నాడు. టాప్ ఆర్డ‌ర్‌లో శుభ‌మ‌న్ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్‌, కేఎల్ రాహుల్‌, ర‌వీంద్ర జ‌డేజా ఉన్నారు. బౌల‌ర్ల జాబితాలో శార్దూల్ ఠాకూర్‌, జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్‌, ష‌మీ, అక్ష‌ర్ ప‌టేల్ ఉన్నారు. ఇషాన్ కిష‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌ల‌కు కూడా చోటు క‌ల్పించారు

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...